News November 15, 2025

కలెక్టరేట్‌లో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

image

తిరుపతి కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా విద్యాశాఖ బాలల దినోత్సవం నిర్వహించింది. ఇందులో భాగంగా రోజూ 3 KMపైగా నడిచి పాఠశాలకు వచ్చే 30 మంది గిరిజన విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సైకిళ్లను దాతలు అందజేశారు. DEO K.V.N.కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల పురోగతికి తోడ్పడుతున్న దాతకు విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News November 15, 2025

పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులతో ఆమె సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల అధ్యయన పద్ధతులు, బోధనా ప్రమాణాల మెరుగుదలపై కలెక్టర్ మార్గదర్శకాలు ఇచ్చారు.

News November 15, 2025

కొడంగల్‌లో ఎడ్యుకేషన్ హబ్ ఉట్టి మాటేనా.?

image

విద్యా సంస్థల ఏర్పాటుతో కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగులుతోందనే ప్రచారం సాగుతోంది. మెడికల్ కళాశాల, సమీకృత గురుకులాలు లగచర్లకు తరలింపు సరైంది కాదని, ఇక్కడే ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొడంగల్ మండలంలోని అప్పాయిపల్లిలో మెడికల్ కాలేజీకి భూమిని సేకరించారు. అంతలోనే లగచర్ల, హకీమ్‌పేట్‌కు తరలించడంతో స్థానికంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

News November 15, 2025

NZB: గంజాయిని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

ఎండు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ వెంకటేష్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని భావం సాహెబ్ పాడ్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అమీర్ ఖాన్ అనే వ్యక్తి బైక్‌పై 260 గ్రాముల ఎండు గంజాయిని తరలిస్తూ పట్టుబడినట్లు పేర్కొన్నారు.