News November 19, 2025

HYD: జైలులో మొహియుద్దీన్‌పై దాడి

image

అహ్మదాబాద్ సబర్మతి జైలులో రాజేంద్రనగర్‌కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్‌పై దాడి జరిగింది. తోటి ఖైదీలే అతడిపై దాడి చేయడంతో జైలు భద్రతా సిబ్బంది కాపాడారు. గాయపడిన అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించి తిరిగి జైలుకు తీసుకొచ్చామని జైలు సూపరెంటెండెంట్ గౌరవ్ తెలిపారు. ఉగ్ర చర్యల్లో భాగంగా అతడు రిసిన్ నీటిలో కలపడానికి యత్నించాడనే అనుమానుంతో అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News March 12, 2026

కడప: నేటి ఇంటర్ 1st ఇయర్ పరీక్షలకు 92% విద్యార్థులు హాజరు.!

image

కడప జిల్లాలో గురువారం 59 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ కామర్స్ పేపర్-1 పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 92% విద్యార్థులు హాజరయ్యారు. 3,226 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 2,956 మంది హాజరయ్యారు. 270 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు. నేటి పరీక్షలకు ఒకేషనల్ విద్యార్థులు లేరు. నేటి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ మీడియట్ అధికారులు తెలిపారు.

News March 12, 2026

సముద్ర గర్భంలో మృత్యుపాశాలు!

image

సముద్ర గర్భంలో దాగి ఉండే ‘నావికా దళ మైన్స్’ అత్యంత ప్రమాదకరమైనవి. తాజాగా హార్ముజ్ జలసంధిలో ఇరాన్ వీటిని మోహరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి నౌకలను క్షణాల్లో ధ్వంసం చేయగలవు. ఓడల శబ్దం లేదా అయస్కాంత సెన్సార్ల ద్వారా ఇవి పేలుతాయి. అత్యంత ఆధునికమైన రైజింగ్ టార్పెడో, ఇన్‌ఫ్లుయెన్స్ మైన్స్ శబ్దాన్ని పసిగట్టి దాడులు చేస్తాయి. శత్రువును ముంచడమే కాదు, సముద్ర ప్రయాణాన్నే అసాధ్యం చేయగల సత్తా వీటికి ఉంది.

News March 12, 2026

మణుగూరు: బ్రెయిన్ ట్యూమర్‌తో బీటెక్ విద్యార్థిని మృతి

image

మణుగూరు పట్టణంలోని చాకలి ఐలమ్మ నగర్‌కు చెందిన రాపర్తి అనూష అనే బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థిని బ్రెయిన్ ట్యూమర్‌తో మృతి చెందింది. ఇటీవల టైఫాయిడ్ జ్వరం రావడంతో వ్యాధి మెదడుకు వ్యాపించి పరిస్థితి విషమించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.