News November 26, 2025

సిద్దిపేట: ఎన్నికల్లో ఉత్సాహం చూపుతున్న యువత

image

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. కొన్ని ఏళ్లుగా పల్లెల్లో మార్పు కోసం ఎంతగానో ఎదురుచూసిన నాయకులు మాత్రం ఎలాంటి మార్పు చేయకపోవడంతో నాయకుల పట్ల యువత నిరాశ చెందారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మార్పు రావాలనే దృక్పథంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామాలను అభివృద్ధి చేయాలనే పట్టుదలతో కొత్త ఆలోచనలతో యువత ముందుకు వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో యువతపై ప్రభావం ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News December 2, 2025

నల్గొండ: గ్రామాల్లో బుజ్జగింపుల పర్వం!

image

తొలిదశ నామినేషన్లకు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు ఒకటే టెన్షన్ పట్టుకుంది.
జిల్లాలో అనేక పంచాయతీలో ప్రతీ పార్టీ నుంచి నలుగురైదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రామస్థాయి కార్యకర్తలు ఏళ్లుగా స్థానిక సంస్థల్లో పోటీ కోసం ఎదురుచూస్తున్నారు. తీరా ఆ అవకాశం రాగానే ఎగిరి గంతేసి బరిలోకి దూకారు. స్వతంత్ర అభ్యర్థులతో ఎలాంటి ఇబ్బందులు లేవు గానీ, తీరా పార్టీ అభ్యర్థులతోనే చిక్కులన్నీ.

News December 2, 2025

HNK: స్థానిక ఎన్నికలు.. షెడ్యూల్ ఇదే!

image

జిల్లాలోని 12 మండలాల్లో 3 విడతలుగా స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హుజురాబాద్(C) కమలాపూర్‌లో 1వ విడత 11న, వర్ధన్నపేట(C)లోని హసన్పర్తి, ఐనవోలు, ఘనపూర్ పరిధిలోని ధర్మసాగర్, వేలేరు, పరకాల మండలాల్లో 2వ విడత 14న, పరకాల పరిధిలోని దామెర, నడికూడ, ఆత్మకూరు, భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేటలో 3వ విడత 17న ఎన్నికలు జరగనున్నాయి.

News December 2, 2025

నల్గొండ: స్టోన్ క్రషర్స్ యజమానుల సమ్మె బాట షురూ!

image

నల్గొండ జిల్లాలో స్టోన్ క్రషర్స్ యజమానులు సమ్మెబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో స్టోన్ క్రషర్ మిల్లులు నడపటం కష్ట సాధ్యంగా మారిందని వాటి యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి జిల్లాలోని స్టోన్ క్రషర్స్ మిల్లులను బంద్ పెట్టిన వాటి యజమానులు సమ్మెబాట పట్టారు.