News December 8, 2025
అనకాపల్లి: చిన్నారుల ఆధార్ నమోదును వేగవంతం చేయాలి

జిల్లాలో ఐదేళ్ల లోపు చిన్నారుల ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ఆధార్ కార్డుల నమోదు, నవీకరణపై జిల్లాస్థాయి ఆధార్ కమిటీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలలో ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ నమోదు చేయాలన్నారు. తల్లి బిడ్డకు జన్మ ఇచ్చిన వెంటనే వైద్యశాలలోనే ఆధార్ నమోదు చేయాలన్నారు.
Similar News
News December 9, 2025
మెటాకు షాక్.. 4 ఏళ్లలో $70 బిలియన్లు హాంఫట్

VR హెడ్ సెట్స్, స్మార్ట్ గ్లాసెస్తో గేమింగ్ కమ్యూనిటీకి చేరువకావాలనుకున్న మెటా ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. నాలుగేళ్లలో 70 బిలియన్ డాలర్లు నష్టపోయింది. 2026 ఆర్థిక సంవత్సరంలో రియాల్టీ ల్యాబ్స్ బడ్జెట్లో 30% కోత విధించాలని నిర్ణయించింది. అందులో భాగంగా జనవరిలో లేఆఫ్స్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్ వాల్యూ పెరిగే వరకు MR గ్లాసెస్ లాంచ్ను పోస్ట్పోన్ చేయనున్నట్లు తెలుస్తోంది.
News December 9, 2025
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్–వాష్ అండ్ గో’: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్–వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. భారీ వాహనాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్డివిజన్లలో నేషనల్ హైవేలు 40, 44పై లారీలు, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, వ్యాన్లు, లగేజీ వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించారు.
News December 9, 2025
రామన్నపేట ఆర్ఐ రాజేశ్వర్ సస్పెండ్

రామన్నపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) రాజేశ్వర్ను సస్పెండ్ చేసినట్లు చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి తెలిపారు. కక్కిరేణిలోని శ్రీ భక్తమార్కండేయ స్వామి ఆలయానికి చెందిన 4.3 ఎకరాల భూమి ధరణిలో తప్పుగా నమోదైంది. దీనిపై 2024లో ఆర్ఐ పంచనామా చేసి ఆలయానికి చెందినదని నిర్ధారించారు. అయితే, 2025 జనవరిలో క్షేత్రస్థాయికి వెళ్లకుండా తప్పుడు పంచనామా ఇచ్చినందుకు ఆయనను సస్పెండ్ చేసినట్లు ఆర్డీఓ పేర్కొన్నారు.


