News April 26, 2024

పిఠాపురం బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి

image

AP: పిఠాపురంలో చెప్పులు కుట్టే వ్యక్తి ఏడిద భాస్కరరావు ఎన్నికల బరిలో నిలిచారు. నిన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇంటర్ వరకు చదివిన భాస్కరరావు స్థానిక ప్రభుత్వ కాలేజీ వద్ద చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పాదరక్షలు కుడుతూనే ఎంఏ రాజనీతిశాస్త్రంపై అధ్యయనం చేయడం విశేషం. ఆయన వద్ద రూ.20 వేల నగదు మాత్రమే ఉంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News April 16, 2026

వీడు మాయగాడు.. 500 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు!

image

సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లలో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి అమ్మాయిల్ని మోసం చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్‌కు చెందిన ఆనంద్(35) తాను డాక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, మోడల్, బిజినెస్‌మ్యాన్ అంటూ ఒక్కొక్కరితో ఒక్కోలా పరిచయం చేసుకున్నాడు. వాళ్లు దగ్గరయ్యాక మెడికల్ ఎమర్జెన్సీ పేరిట, ప్రైవేట్ ఫొటోలు లీక్ చేస్తానని బెదిరించి ₹2Cr వసూలు చేశాడు. దాదాపు 500మంది యువతుల్ని మోసగించాడు.

News April 16, 2026

మోదీ నాయకత్వంలో దక్షిణాది బలపడుతుంది: బండి సంజయ్

image

డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం <<19667857>>అమిత్ షా ప్రకటనతో<<>> తప్పని తేలిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. చాలా కాలంగా కొన్ని పార్టీలు నార్త్ vs సౌత్ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మోదీ నాయకత్వంలో దక్షిణాది బలహీనపడదని, మరింత బలంగా మారుతుందని స్పష్టం చేశారు.

News April 16, 2026

మోదీ నాయకత్వంలో దక్షిణాది బలపడుతుంది: బండి సంజయ్

image

డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం <<19667857>>అమిత్ షా ప్రకటనతో<<>> తప్పని తేలిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. చాలా కాలంగా కొన్ని పార్టీలు నార్త్ vs సౌత్ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మోదీ నాయకత్వంలో దక్షిణాది బలహీనపడదని, మరింత బలంగా మారుతుందని స్పష్టం చేశారు.