News April 4, 2024

వరుస ప్రమాదాలు.. కార్మికుల ఆందోళన!

image

TG: సంగారెడ్డి(D) చందాపూర్ పేలుడు <<12982731>>ఘటన<<>>లో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. పారిశ్రామిక వాడలో వరుసగా ప్రమాదాలు జరుగుతుండడంపై కార్మికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలం చెల్లిన రియాక్టర్ల వాడకం, రెగ్యులర్‌గా తనిఖీలు చేయకపోవడం వల్లే తరచుగా ప్రమాదాలు జరుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. రెండేళ్లలో 40 ప్రమాదాలు జరగగా, 72 మంది మృతిచెందినట్లు, మృతుల్లో ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

Similar News

News February 19, 2026

తక్కువ ధరల్లో పశు ఔషధాలు: అచ్చెన్నాయుడు

image

AP: పశుపోషకులకు సబ్సిడీ ధరల్లో జనరిక్ పశు ఔషధాలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘దీనికోసం పశు వైద్యశాలల ఆవరణలో 150 ఔషధ విక్రయ కేంద్రాలు పెడతాం. గొర్రెల పెంపక సహకార సంఘాలకు వీటిని అప్పగిస్తాం. ₹5.41 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలుచేస్తాం. యూనిట్ పెట్టేవారికి ప్రత్యేక సాయం కింద ₹1.5 లక్షలు అందిస్తాం. కొనుగోలుపై 20% ప్రోత్సాహకం, విక్రయాలపై 20% మార్జిన్ లభిస్తుంది’ అని మంత్రి చెప్పారు.

News February 19, 2026

వరుణ్.. నువ్వో వరం!

image

టీ20ల్లో టీమ్ ఇండియాకు వరుణ్ చక్రవర్తి వరంలా మారారు. గత 29 టీ20ల్లో 28 మ్యాచుల్లో అతడు వికెట్లు పడగొట్టడం విశేషం. ఒక్క మ్యాచులో మాత్రమే వికెట్లు తీయలేదు. కీలక సమయాల్లో తన మిస్టరీ బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడం వరుణ్ స్పెషల్. ఈ ప్రపంచకప్‌లోనూ మిగతా బౌలర్లు వికెట్లు తీయలేక ఇబ్బందులు పడుతుంటే వరుణ్ వరుసగా వికెట్లు తీస్తూ భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

News February 19, 2026

భారీగా తగ్గిన రష్యన్ ఆయిల్ దిగుమతులు

image

భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా భారీగా తగ్గింది. ఒకప్పుడు 40% ఉన్న షేర్ ఇప్పుడు 21.1%కు పడిపోయింది. జనవరిలో రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది. 2022 నవంబరు తర్వాత ఇంత తక్కువ దిగుమతులు చేసుకోవడం ఇదే తొలిసారి. మార్చిలో ఈ దిగుమతి రోజుకు 8లక్షల బ్యారెళ్లకు పడిపోవచ్చని అంచనా. మరోవైపు జనవరి చమురు దిగుమతుల్లో మిడిల్ ఈస్ట్ వాటా దాదాపు 55%గా నమోదైంది.