News March 25, 2024
ఏ భాషలోనైనా ఉగ్రవాది ఉగ్రవాదే: జైశంకర్

ఉగ్రవాదుల్ని అంతర్జాతీయంగా స్తంభింపచేసేందుకు భారత్ యత్నిస్తుండగా, UNSCలో చైనా వీటో అధికారంతో అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పరోక్ష విమర్శలు చేశారు. ‘వేరే భాష వాడుతున్నారనో లేక వేరే కారణం ఉందనో ఉగ్రవాదుల్ని ఎన్నడూ క్షమించకూడదు. ఏదైనా కారణం చెప్పి వారిని కాపాడితే, కచ్చితంగా సమస్యలు తలెత్తుతాయి’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News December 10, 2025
మా దేశం పేరు సంస్కృతం నుంచే వచ్చింది: సింగపూర్ మాజీ డిప్యూటీ PM

సింగపూర్ లేదా సింగపురా అనే పేరు సంస్కృతం నుంచి ఉద్భవించిందని ఆ దేశ మాజీ ఉప ప్రధాని తియో చీ హియాన్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన అటల్ బిహారీ వాజ్పేయి మెమోరియల్ లెక్చర్లో ఆయన మాట్లాడుతూ భారత్-సింగపూర్ చారిత్రక అనుబంధం గురించి వెల్లడించారు. 1867 వరకు కోల్కతా నుంచి సింగపూర్ పరిపాలన జరిగిందని గుర్తుచేశారు. తమ దేశ ఆర్థిక, సాంస్కృతిక నిర్మాణంలో భారతీయులు కీలకపాత్ర పోషించారని కొనియాడారు.
News December 10, 2025
సుందర్ పిచాయ్తో మంత్రి లోకేశ్ భేటీ

US పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారు. విశాఖలో AI డేటా సెంటర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించాలన్నారు. సంస్థలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.
News December 10, 2025
IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<


