News October 3, 2024
గడ్డం గీయించుకుంటుంటే ఢీ కొట్టిన ట్రక్కు!

మృత్యువు ఎప్పుడు ఎలా కబళిస్తుందో ఊహించడం అసాధ్యం. UPలో జరిగిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. చాంద్వారీ గ్రామానికి చెందిన రాజేశ్(55) హైవే పక్కన ఉన్న ఓ సెలూన్లో గడ్డం గీయించుకుంటున్నారు. అదే సమయానికి హైవేపై వెళ్తున్న ఓ డీసీఎం ట్రక్కు అదుపు తప్పింది. సరిగ్గా ఆ సెలూన్ షాపుపైకి దూసుకెళ్లింది. దీంతో రాజేశ్ అక్కడికక్కడే మరణించారు. షాపులో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా చికిత్స అందుతోందని పోలీసులు తెలిపారు.
Similar News
News December 14, 2025
KMR: ఉత్కంఠ పోరు.. GP పీఠం కోసం నానా తంటాలు!

కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న 2వ విడత GP ఎన్నికలు పలు చోట్ల అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అత్యంత రసవత్తరంగా సాగుతున్న ఈ పోరులో అభ్యర్థులు విజయం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నదైనా, పెద్దదైనా గ్రామ పంచాయతీ పీఠాన్ని దక్కించుకోవడానికి అభ్యర్థులు చేస్తున్న ఖర్చు, అనుసరిస్తున్న వ్యూహాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
News December 14, 2025
INDvsSA.. గెలుపు ఎవరిదో?

టీ20 సిరీస్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వేదికగా ఇవాళ టీమ్ ఇండియాతో దక్షిణాఫ్రికా మూడో మ్యాచ్ ఆడనుంది. తొలి రెండు మ్యాచుల్లో చెరో విజయంతో ఇరు జట్ల ఫోకస్ ఈ మ్యాచ్ నెగ్గడంపైనే ఉంది. రెండో T20లో నెగ్గిన సఫారీ ప్లేయర్లు అదే జోష్లో ఉన్నారు. అటు ఓటమితో కంగుతిన్న టీమ్ ఇండియా ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని కసిగా ఉంది. మ్యాచ్ 7pm నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్లో లైవ్ చూడవచ్చు.
News December 14, 2025
రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు

TG: కాంగ్రెస్ అగ్రనేత <<18553262>>రాహుల్<<>> హైదరాబాద్ పర్యటనపై BRS విమర్శలకు దిగింది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రక్తమోడుతుంటే TG వచ్చేందుకు ఆయనకు సమయంలేకుండా పోయిందని <


