News May 15, 2024
హైదరాబాద్ జూలో ‘అభిమన్యు’ మృతి

హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్కులో తొమ్మిదేళ్ల పులి ‘అభిమన్యు’ అనారోగ్యంతో మృతిచెందింది. ఇది అరుదైన తెలుపు బెంగాల్ టైగర్ కావడం గమనార్హం. బద్రి, సురేఖ అనే పులులకు 2015, జనవరి 2న ఇదే జూలో ఈ పులి జన్మించింది. నెఫ్రిటిస్ సమస్యతో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇబ్బంది పడుతోందని జూ అధికారులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో కొన్ని రోజులుగా ఆహారం తినలేదని, మంగళవారం మధ్యాహ్నం ప్రాణం విడిచిందని వెల్లడించారు.
Similar News
News December 14, 2025
INDvsSA.. గెలుపు ఎవరిదో?

టీ20 సిరీస్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వేదికగా ఇవాళ టీమ్ ఇండియాతో దక్షిణాఫ్రికా మూడో మ్యాచ్ ఆడనుంది. తొలి రెండు మ్యాచుల్లో చెరో విజయంతో ఇరు జట్ల ఫోకస్ ఈ మ్యాచ్ నెగ్గడంపైనే ఉంది. రెండో T20లో నెగ్గిన సఫారీ ప్లేయర్లు అదే జోష్లో ఉన్నారు. అటు ఓటమితో కంగుతిన్న టీమ్ ఇండియా ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని కసిగా ఉంది. మ్యాచ్ 7pm నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్లో లైవ్ చూడవచ్చు.
News December 14, 2025
రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు

TG: కాంగ్రెస్ అగ్రనేత <<18553262>>రాహుల్<<>> హైదరాబాద్ పర్యటనపై BRS విమర్శలకు దిగింది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రక్తమోడుతుంటే TG వచ్చేందుకు ఆయనకు సమయంలేకుండా పోయిందని <
News December 14, 2025
కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా ఏపీ: బొత్స

AP: ఆరోగ్యంగా ఉన్న ఏపీ కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా దూసుకుపోతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘18 నెలల వ్యవధిలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసింది. మేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో సంక్షేమ పథకాల ఖర్చుకు రూ.3.45 లక్షలు కోట్లు అప్పు చేశాము. అయితే కూటమి ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తుందో ఎవరికీ తెలియదు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వక ఈ ప్రభుత్వం రైతులను కష్టపెడుతుంది’ అని ఫైరయ్యారు.


