News June 21, 2024
పెళ్లికి రావాలని అల్లు ఫ్యామిలీని ఆహ్వానించిన నటి వరలక్ష్మి

తమిళ నటి వరలక్ష్మి శరత్కుమార్, తన ప్రియుడు నికోలై సచ్దేవ్ని జూలై 2వ తేదీన వివాహం చేసుకోనున్నారు. వీరిద్దరి పెళ్లి థాయ్లాండ్లో జరగనున్నట్లు సినీవర్గాల సమాచారం. ఈక్రమంలో టాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించేందుకు ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. తాజాగా ఈ జంట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అల్లు అరవింద్ని కలిసి కుటుంబమంతా హాజరుకావాలని ఆహ్వానించింది.
Similar News
News January 21, 2026
జిల్లా గ్రంథాలయ ఛైర్మన్గా వడ్డె వెంకట్ బాధ్యతల స్వీకరణ

అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా వడ్డె వెంకట్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తనకు, జిల్లా స్థాయి ఉన్నత పదవి కల్పించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని గ్రంథాలయాలను ఆధునీకరించి, విద్యార్థులకు, పాఠకులకు అందుబాటులో ఉండేలా అభివృద్ధి బాటలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
News January 21, 2026
గుండెపోటుతో నటుడు మృతి

మలయాళ నటి ఊర్వశి సోదరుడు, నటుడు కమల్ రాయ్(54) కన్నుమూశారు. చెన్నైలో ఆయన గుండెపోటుతో మరణించారు. తమిళ్ సినిమా ‘పుతుస పడికిరెన్ పాటు’ సినిమాతో హీరోగా పరిచయమైన కమల్ 30 చిత్రాల్లో నటించారు. ఇందులో సాయుజ్యం, మంజు, కింగిని, వచలమ్, శోభనం, ది కింగ్ మేకర్, లీడర్ తదితర సినిమాలున్నాయి. ఆయన సోదరి ఊర్వశి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో మొత్తం 350 చిత్రాల్లో నటించారు.
News January 21, 2026
ఆరావళి అక్రమ మైనింగ్.. కోలుకోలేని నష్టమన్న SC

ఆరావళి పర్వతాల్లో అక్రమ మైనింగ్పై రివ్యూ చేసేందుకు ఎక్స్పర్ట్ కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అక్రమ మైనింగ్ కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. కమిటీ కోసం పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తల పేర్లను 4 వారాల్లోగా ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. నిపుణుల కమిటీ తమ పర్యవేక్షణలో పనిచేస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్తగా మైనింగ్ లీజులను మంజూరు చేయడాన్ని నిషేధించింది.


