News July 31, 2024
కేరళకు అదానీ రూ.5కోట్ల విరాళం

ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5కోట్ల విరాళం ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని వయనాడ్లో కొండచరియలు విరిగి ఘోరమైన ప్రాణనష్టం వాటిల్లడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో అదానీ గ్రూప్ కేరళకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా ఈ ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య 163కి చేరింది.
Similar News
News December 15, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 15, 2025
దేశంలోనే వృద్ధ ఎమ్మెల్యే కన్నుమూత

దేశంలో అత్యంత వృద్ధ ఎమ్మెల్యేగా పేరొందిన శామనూరు శివశంకరప్ప(95) మరణించారు. కర్ణాటకలోని దావణగెరె సౌత్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. వయో సంబంధిత సమస్యలతో మరణించారని వైద్యులు తెలిపారు. 1969లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శివశంకరప్ప MPగానూ పనిచేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతిపై పార్టీ నేతలు విచారం వ్యక్తం చేశారు.
News December 15, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 15, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.21 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.11 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.44 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.02 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


