News November 7, 2025
ADB: ఉద్యోగం పేరిట రూ.6.08లక్షలు కాజేశారు

సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ యువకుడు మోసపోయిన ఘటన ఆదిలాబాద్లో జరిగింది. ఖుర్శిద్ నగర్కు చెందిన ఓ యువకుడికి ఇన్స్టాలో జాబ్ యాడ్ వచ్చింది. అది చూసి సదరు కంపెనీని సంప్రదించాడు. టాస్క్లు పూర్తి చేస్తే అకౌంట్లో నగదు జమ అవుతుందని నమ్మించి విడతల వారీగా రూ.6.08 లక్షలు కాజేశారు. మోసపోయినట్లు గ్రహించిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిత్యం పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయి.
Similar News
News January 13, 2026
నెల్లూరు వాసికి కీలక పోస్టింగ్

నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూరుకు చెందిన ఏటూరు భాను ప్రకాష్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్గా నియమితులయ్యారు. రాజస్థాన్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారిగా 2004 నుంచి అక్కడ పనిచేస్తున్నారు. డిప్యుటేషన్పై మన రాష్ట్రంలోనూ కొంతకాలం విధులు నిర్వర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో నెల్లూరు జిల్లా వాసి పదవి పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం.
News January 13, 2026
జిల్లాల పునర్విభజన ఇప్పుడు సాధ్యం కాదా?

TG: జిల్లాల పునర్విభజన చేపడతామన్న ప్రభుత్వ నిర్ణయానికి దేశవ్యాప్త జనగణన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. 2027 MAR 1 నుంచి జరిగే ఈ ప్రక్రియ నేపథ్యంలో జిల్లాల సరిహద్దులు ఇప్పట్లో మార్చొద్దని గతంలో కేంద్రం సూచించింది. దీనివల్ల జనగణనలో ఇబ్బందులు ఏర్పడి, జిల్లాలవారీ లెక్కలు తీయడం సాధ్యం కాదని చెప్పింది. మరి పునర్విభజనకు ప్రభుత్వం రెండేళ్లు ఆగుతుందా? లేదంటే ఎలా ముందుకెళ్తుంది? అనేది ఆసక్తికరం.
News January 13, 2026
చిత్తూరు: చర్చిలో సంక్రాంతి వేడుకలు

చిత్తూరు జిల్లా నగరిలోని సీఎస్ఐ ఈస్ట్ చర్చిలో ముందస్తు సంక్రాంతి వేడుకలను సోమవారం నిర్వహించారు. ప్రెస్ బ్రైటర్ రెవరెండ్ టి.రాజప్రభు ఆధ్వర్యంలో చర్చిని రంగవల్లులు, చెరకు గడలు, పొంగలి కుండలతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు. సంక్రాంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాలు కలగాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత సామరస్యాన్ని చాటి చెప్పేలా వేడుకలు చేశారని పలువురు పేర్కొన్నారు.


