News March 5, 2025

ADB: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో 40 మంది ఎలిమినేట్

image

కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎన్నిక తేలక పోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో 40 మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎమ్మెల్సీ ఓట్లు నిర్ధారణ కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అధికారులు లెక్కించనున్నారు.

Similar News

News December 10, 2025

బాలికపై మంచిర్యాల యువకుల అత్యాచారం

image

సంగారెడ్డికి చెందిన 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నలుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ తెలిపారు. ఈనెల 4న అదృశ్యమైన బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 8న బాలిక సికింద్రాబాద్‌లో ఉండగా, మంచిర్యాలకు చెందిన ఇద్దరు మైనర్లు, ఇద్దరు యువకులు ఆమెను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.

News December 10, 2025

అమరావతికి రానున్న జాతీయ ఫోరెన్సిక్ వర్సిటీ

image

ఉగాండా హత్యకేసులో హంతకుడిని DNAతో పట్టించిన అదే NFSEU త్వరలో అమరావతిలో నెలకొననుంది. హత్యాస్థలం నుంచి సేకరించిన ఆధారాలను, సీసీ టీవీ పుటేజీలను శాస్త్రీయంగా విశ్లేషించి నిందితుడి ఆచూకీని గుర్తించిన వర్సిటీ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశంలో ఉగ్రవాద కేసుల దర్యాప్తుల్లోనూ ఈ వర్సిటీ కీలక పాత్ర పోషించింది. అమరావతిలో శాఖ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు CM చంద్రబాబుకు ఇచ్చినట్లు వీసీ తెలిపారు

News December 10, 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.870 పెరిగి రూ.1,30,310కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.800 ఎగబాకి రూ.1,19,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.8,000 పెరిగి రూ.2,07,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.