News December 1, 2025
ADB: తీవ్ర చలిలో వేడెక్కిన రాజకీయం..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పులి పంజా విసురుతోంది. పంచాయతీ ఎన్నికలు రావడంతో అభ్యర్థులు చలిని సైతం లెక్కచేయకుండా రాత్రి వేళల్లో సమావేశాలు పెడుతున్నారు. రాత్రిపూట తమ మద్దతు దారులతో ఓటర్ల ఇంటికి వెళ్లి తమకే ఓటేయాలని కోరుతున్నారు. నాకు ఓటేస్తే మీ వర్గానికి కావాల్సిన పనులన్నీ చేసి ఇస్తా, అందరికీ కలిపి కొంత నగదు ఇస్తా అంటూ హామీలు ఇస్తున్నారు. ఈ చర్యలు ప్రత్యర్థులకు మరింత వణుకు పుట్టిస్తున్నాయి .
Similar News
News February 13, 2026
తిరుపతి: అనాధికారిక డీకేటీ ఇళ్ల పన్ను మార్పులపై ఫిర్యాదు

తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 190 డీకేటీ ఇళ్లకు సంబంధించి వెబ్ సైట్ ద్వారా అనాధికారికంగా పన్ను మార్చారు. గడిచిన రెండేళ్లుగా డీకేటీ పన్ను మార్పు చేయడం లేదు. దీంతో కొందరు దొడ్డిదారిన ఈ పని చేసినట్లు డీసీ గుర్తించి కమిషనర్ మౌర్య దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై శుక్రవారం ఎస్పీకి రాతపూర్వకంగా ఏ ULR నుంచి మార్పు చేశారు. ఎవరు మార్చుకున్నారో విచారణ చేసి కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
News February 13, 2026
మున్సిపాలిటీలపై ‘హస్తం’

TG: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాలకు అందనంత దూరంలో నిలిచింది.
➤ మున్సిపాలిటీలు..
* కాంగ్రెస్ – 64
* బీఆర్ఎస్ – 15
* హంగ్ – 36
* ఇతరులు – 1, * బీజేపీ – 0
➤ వార్డులు * కాంగ్రెస్ – 1346, బీఆర్ఎస్ – 723, బీజేపీ – 261, ఇతరులు – 252
News February 13, 2026
బంగ్లాలో అధికారంలోకి BNP.. భారత్కు తొలి అభ్యర్థన!

భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ PM హసీనాను అప్పగించమని కోరతామని అక్కడి తాజా ఎన్నికల్లో గెలుపొందిన BNP ప్రకటించింది. ఇప్పటికే ఆ మేరకు అభ్యర్థనలు పంపిన విషయాన్ని గుర్తు చేసింది. పొరుగుదేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని, విదేశాంగ శాఖల స్థాయిలో దీని పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని స్పష్టం చేసింది. 2024 ఆగస్టులో భారత్కు వచ్చిన హసీనాకు బంగ్లాలోని ICJ కోర్టు మరణశిక్ష విధించింది.


