News March 5, 2025
ADB: మీనాక్షి MEETING.. శ్రేణులు WAITING

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్ బుధవారం ఆదిలాబాద్ పార్లమెంటరీ సమావేశాన్ని HYD గాంధీభవన్లో నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఇప్పటికే ఆమె నివేదిక తెప్పించుకున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ మీటింగ్లో పాల్గొననుండడంతో ఆమె ఏం చెబుతారోనని శ్రేణులు వెయిట్ చేస్తున్నారు. మీ కామెంట్?
Similar News
News December 16, 2025
GNT: గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులు అరెస్ట్

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గంజాయి మూలాలను కూకటివేళ్లతో పెకలించి వేస్తున్నామని DSP అబ్దుల్ అజీజ్ అన్నారు. పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతీనగర్ అబ్దుల్ బాబా మసీదు ఎదురు ఖాళీస్థలంలో ఐదుగురు యువకులు గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నారు. పాతగుంటూరు పోలీసులు అరెస్ట్ చేయగా కేసు వివరాలను DSP వివరించారు. వారి వద్ద నుంచి 20గ్రాముల గంజాయి, 4 గ్రాముల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
News December 16, 2025
VKB: మూడో విడత 157 గ్రామపంచాయతీలకు పోలింగ్

మూడో విడత వికారాబాద్ జిల్లాలో 157 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గంలోని 5 మండలాల్లో 157 గ్రామాలకు 18 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. పరిగి 32, పూడూరు 32, కుల్కచర్ల 33, దోమ 36, చౌడాపూర్ 24, గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు మండల కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
News December 16, 2025
NZB: మూడో విడత.. పోలింగ్ జరిగే మండలాలివే

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్కు 1100 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మూడో విడత పోలింగ్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లోని కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జరగనుంది.


