News December 1, 2025

ADB: 9 ఏళ్లుగా సర్పంచ్ లేడు

image

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. అలాంటి పల్లెల అభివృద్ధిలో పాలకవర్గాలు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ ఆ పంచాయతీకి 19 ఏళ్లుగా సర్పంచ్ లేడు. అదే తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామం. 2000 సంవత్సరంలో రుయ్యాడి గ్రామాన్ని ఏజెన్సీ ప్రాంతంగా ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి అక్కడ ఎస్టీ రిజర్వేషన్ వస్తోంది. గ్రామంలో ఒక్క గిరిజనుడు కూడా లేకపోవడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. దీంతో పల్లె అభివృద్ధి పడకేసింది.

Similar News

News December 2, 2025

గొర్రెలకు సంపూర్ణాహారం అందకపోతే జరిగేది ఇదే

image

గొర్రెలకు సరైన పోషకాహారం అందకుంటే పెరుగుదల లోపించి త్వరగా బరువు పెరగవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి సులభంగా వ్యాధుల బారిన పడతాయి. అంతర, బాహ్య పరాన్న జీవుల కారణంగా గొర్రెలకు వ్యాధుల ముప్పు పెరుగుతుంది. గొర్రెల ఉన్ని రాలిపోతుంది. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. గర్భస్రావాలు, పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా జన్మించడం, సకాలంలో ఎదకు రాకపోవడం, ఈతల మధ్య వ్యవధి పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

News December 2, 2025

ధరలు డబుల్.. దానిమ్మ రైతులకు గోల్డెన్ టైం!

image

అనంతపురం జిల్లాలో దానిమ్మ రైతులకు మంచి రోజులొచ్చాయి. ప్రస్తుతం టన్ను ఏకంగా ₹లక్ష పలుకుతోంది. జిల్లాలో 13,381 ఎకరాల్లో ఈ పంట సాగులో ఉంది. తాడిపత్రి, నార్పల, యల్లనూరు, పుట్లూరు, యాడికి తదితర మండలాల్లో అధికంగా సాగుచేశారు. 3 నెలల క్రితం టన్ను రూ.50-60 వేల వరకు ఉండగా ప్రస్తుతం రెట్టింపు అవడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఇతర రాష్ట్రాలో దిగుబడి ఆలస్యం కావడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

News December 2, 2025

HYD: ప్రేమ జంట ఆత్మహత్య(UPDATE)

image

రంగారెడ్డి జిల్లా కొత్తూరులో <<18443763>>ప్రేమ జంట<<>> ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, కొత్తూరు పట్టణంలో ఓ బేకరీ పరిశ్రమలో పనిచేస్తున్న అనామిక అదే కంపెనీలో బిహార్‌కు చెందిన ధనుంజయ్‌‌‌‌‌‌ను ప్రేమించింది. అనామిక పరిశ్రమకు వెళ్లకపోవడంతో ధనుంజయ్‌ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించా