News January 21, 2025
బ్యాంక్ ఖాతాదారులకు ALERT

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. KYC వివరాలను అప్డేట్ చేయని కస్టమర్లు జనవరి 23 నుంచి తమ ఖాతాలను ఉపయోగించలేరు. ఇందుకోసం ఓటర్, ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, విద్యుత్ బిల్లు వంటి వాటిల్లో ఏదో ఒక పత్రం సమర్పించి KYC చేయించాలి. వీటి వివరాలను పరిశీలించి బ్యాంక్ ఖాతాదారుల వివరాలను అప్డేట్ చేస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదంటే నేరుగా బ్రాంచ్లో అయినా ఇది చేయవచ్చు.
Similar News
News February 18, 2025
బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిది: PM

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిదని, ఇది మరింత బలపడుతోందని తెలిపారు. అభివృద్ధి రాజకీయాలకు ఇది పెద్ద విజయం అని అభివర్ణించారు. GJలో 1912 వార్డులకు గాను బీజేపీ 1402, కాంగ్రెస్ 260, ఎస్పీ, ఆప్ కలిసి 236 వార్డులు గెలుచుకున్నాయి. 68 మున్సిపాలిటీల్లో బీజేపీ 57, కాంగ్రెస్ 1, ఎస్పీ 2, ఇతరులు 3 చోట్ల విజయం సాధించాయి.
News February 18, 2025
ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఎల్లుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరగాల్సిన ఏపీ క్యాబినెట్ భేటి వాయిదా పడింది.
News February 18, 2025
PHOTO OF THE DAY

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్తో కలిసి మహాకుంభమేళాలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గంగా దేవికి పవన్ దంపతులు హారతులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీరంతా కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ PHOTO OF DAY ఇదేనంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.