News April 5, 2024
వైసీపీ అభ్యర్థి ఆస్తుల వేలానికి ప్రకటన
AP:ఎమ్మిగనూరు YCP MLA అభ్యర్థి బుట్టా రేణుక ఆస్తుల వేలానికి LIC హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఆమె భాగస్వామిగా ఉన్న బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మరికొన్ని సంస్థల ఆస్తులను మే 6న వేలం వేయనుంది. కొన్నేళ్ల క్రితం LIC హౌసింగ్ నుంచి వ్యాపార అవసరాల కోసం రూ.340 కోట్ల రుణం తీసుకోగా.. నష్టాలు రావడంతో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో LIC వేలం ప్రకటన ఇవ్వగా, దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని ఆమె తెలిపారు.
Similar News
News January 21, 2025
సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్
కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ముంబై లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాసేపటి క్రితం ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. జనవరి 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దుండగుడు కత్తితో దాడి చేశాడు.
News January 21, 2025
PHOTOS: ఫ్యామిలీతో అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో దిగిన కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భార్య స్నేహా రెడ్డితో పాటు కొడుకు అయాన్, కూతురు అర్హ వైట్ టీషర్టు ధరించి కెమెరాలకు పోజులిచ్చారు. మొన్నటి వరకు ‘పుష్ప-2’ సినిమా కోసం హెయిర్, బియర్డ్ పెంచిన బన్నీ.. తాజాగా తన లుక్ను మార్చేసిన విషయం తెలిసిందే. కాగా, మార్చి నెల నుంచి త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబోలో సినిమా ప్రారంభం కానుంది.
News January 21, 2025
భారత్తో తొలి T20.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
భారత్తో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో రేపు జరిగే తొలి T20 కోసం ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. బట్లర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, సాల్ట్(కీపర్), డక్కెట్, బ్రూక్, లివింగ్ స్టోన్, బెథెల్, ఓవర్టన్, అట్కీన్సన్, అర్చర్, రషీద్, వుడ్ జట్టులో ఉండనున్నారు. ఈ మేరకు జట్టును కోచ్ మెక్కల్లమ్ ప్రకటించారు.