News May 1, 2024
ముంబైకి మరో షాక్.. ఆటగాళ్లందరికీ ఫైన్

ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు ఫైన్ పడింది. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో నిర్ణీత సమయానికి బౌలింగ్ పూర్తి చేయకపోవడంతో ‘స్లో ఓవర్ రేట్’ కింద కెప్టెన్ పాండ్యకు రూ.24లక్షల జరిమానా పడింది. జట్టు ఆటగాళ్లకు సైతం 25% మ్యాచ్ ఫీజు లేదా రూ.6లక్షల ఫైన్ పడింది. ఈ సీజన్లో పాండ్యకు ఇది రెండో ఫైన్. మరోసారి ఇలాగే జరిగితే.. మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంటుంది. కాగా LSGతో మ్యాచ్లో ముంబై ఓడిన విషయం తెలిసిందే.
Similar News
News December 8, 2025
ఇతిహాసాలు క్విజ్ – 90 సమాధానం

ప్రశ్న: రామాంజనేయుల నడుమ యుద్ధమెందుకు జరిగింది?
సమాధానం: రాముని గురువు విశ్వామిత్రుడిని కాశీ రాజు యయాతీ అవమానించాడు. దీంతో యయాతిని చంపమని రాముడిని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. అటువైపు తన ప్రాణాలు కాపాడమని యయాతి ఆంజనేయుడిని శరణు వేడాడు. అలా ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆంజనేయుడు పలికిన రామనామం రాముని బాణాలు నిలవలేకపోయాయి. దీంతో విశ్వామిత్రుడు యుద్ధాన్ని ఆపి, యయాతిని క్షమించాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News December 8, 2025
ఇండిగో అంశం కేంద్రం పరిధిలోనిది: చంద్రబాబు

AP: ఇండిగో సంక్షోభాన్ని తాము పర్యవేక్షించడం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరిస్తుందన్నారు. కేంద్రమంత్రి భారత ప్రభుత్వానికి జవాబుదారీ అని చంద్రబాబు తెలిపారు. కాగా ఇండిగో సంక్షోభాన్ని మంత్రి లోకేశ్ మానిటర్ చేస్తున్నారని ఇటీవల ఓ టీవీ డిబేట్లో టీడీపీ MLC దీపక్ రెడ్డి చేసిన కామెంట్స్పై విమర్శలు వ్యక్తమయ్యాయి.
News December 8, 2025
10ఏళ్లలో రూ.కోటి విలువ రూ.55లక్షలే!

మీరు దాచుకున్న డబ్బు విలువ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిపోతుందనే విషయం మీకు తెలుసా? మీ దగ్గర రూ.కోటి ఉంటే ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం(6%) కొనసాగితే మరో పదేళ్లలో అది ₹55.8 లక్షలకు చేరనుంది. 2045లో రూ.31.18లక్షలు, 2075నాటికి ₹కోటి విలువ రూ.5.4లక్షలకు పడిపోనుంది. అందుకే డబ్బును పొదుపు చేయడంతో పాటు సంపద విలువను కాపాడుకోవడానికి పెట్టుబడి పెట్టడం అలవర్చుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.


