News August 8, 2024
కర్ణాటకతో 7 అంశాలపై AP ఒప్పందం

AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటనలో ఆ రాష్ట్రంతో 7 అంశాలపై ఒప్పందం జరిగింది. 8 కుంకీ ఏనుగులు APకి ఇచ్చేందుకు కర్ణాటక అంగీకరించింది. కర్ణాటక పట్టుకున్న ఎర్రచందనం అప్పగింత, ఎకో టూరిజం అభివృద్ధి, శాటిలైట్ నిఘాతో అటవీ సంపదను రక్షించుకోవడం, వేటగాళ్లను నియంత్రించడం, వన్యప్రాణుల వేట విషయంలో ఉమ్మడి కార్యాచరణతో పోరాడాలని, అడవుల రక్షణపై సమిష్టిగా ముందుకెళ్లాలని పవన్ ఒప్పందాలు చేసుకున్నారు.
Similar News
News December 10, 2025
నేటి నుంచి TET పరీక్షలు

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (TET) నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. మొత్తం 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా 96.25% మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ నెల 21 వరకు రోజుకు 2 సెషన్లలో 9.30AM నుంచి 12PM, 2.30PM నుంచి 5PM వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 133 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.
News December 10, 2025
మెహుల్ చోక్సీ పిటిషన్ కొట్టేసిన బెల్జియం సుప్రీంకోర్టు

PNBను రూ.13వేల కోట్లు మోసం చేసిన ఆర్థిక నేరస్థుడు మెహుల్ చోక్సీ అప్పగింతకు ఆఖరి అడ్డంకి తొలగిపోయింది. ఆయనను INDకు అప్పగించాలని కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బెల్జియం SCలో చోక్సీ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన SC కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ పిటిషన్ను కొట్టేసింది. దీంతో చోక్సీని భారత్కు అప్పగించే ప్రక్రియ మొదలయిందని బెల్జియం అధికారులు తెలిపారు. అతను 2018 JANలో పారిపోయారు.
News December 10, 2025
మీ ఇంట్లో ఇవి ఉంటే లక్ష్మీదేవి రాదు: పండితులు

శుభ్రంగా ఉండే ఇంట్లోకే లక్ష్మీదేవి వస్తుందని పండితులు, వాస్తు నిపుణులు చెబుతున్నారు. పగిలిన కప్పులు/ప్లేట్లు, పాత వార్తాపత్రికలు, కాలం చెల్లిన ఆహారం/మందులు, వాడని దుస్తులు, చనిపోయిన మొక్కలు, పనిచేయని ఎలక్ట్రానిక్స్, ప్రతికూల జ్ఞాపకాలు ఉన్న వస్తువులను వెంటనే తొలగించడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందని అంటున్నారు. తద్వారా మానసిక ఆందోళన దూరమై ఇంట్లో శ్రేయస్సు, సంపద లభిస్తుందని అంటున్నారు.


