News September 11, 2025

AP CRDAకు అవార్డు

image

APCRDAకు GIS, RSA రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్ టెక్నాలజీల వినియోగంలో విశేష ప్రతిభ కనబరిచినందుకు ప్రతిష్టాత్మకమైన Best User Organization అవార్డు లభించింది. హైదరాబాద్‌లో జరిగిన Esri India సంస్థ వార్షిక యూజర్ కాన్ఫరెన్స్‌లో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అజేంద్ర కుమార్ ఈ అవార్డును అందజేశారు. అమరావతి నిర్మాణం, అభివృద్ధిలో జియోస్పేషియల్ టెక్నాలజీని సృజనాత్మకతో సమర్థవంతంగా వినియోగిస్తున్నందుకు లభించింది.

Similar News

News December 16, 2025

పది పరీక్షల్లో జిల్లాను అగ్రగామిగా నిలపాలి: DEO

image

గుంటూరు జిల్లాను రానున్న 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని జిల్లా విద్యాశాఖ అధికారి సలీమ్ బాషా సూచించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని PPD, SJR మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్స్‌ని మంగళవారం DEO పరిశీలించారు. 10వ తరగతి స్లిప్ టెస్ట్ పరీక్షా పత్రాలను పరీక్షించారు. ప్రతి పాఠశాలలో 100 రోజుల ప్రణాళికలు అమలవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట మండల విద్యాశాఖాధికారి అబ్దుల్ ఖుద్దూస్ ఉన్నారు.

News December 16, 2025

నేడు సీఎం చంద్రబాబు బిజీ డే షెడ్యూల్‌

image

@ 10:15 గంటలకు సచివాలయానికి చేరుకున్న సీఎం, రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సేవల అమలుపై సమీక్ష నిర్వహించారు.
@ మధ్యాహ్నం 3:15 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు.
@ సాయంత్రం 4:55 గంటలకు మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌కు చేరుకున్నారు. 5 గంటలకు కొత్తగా నియామకమైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో పాల్గొంటారు.
@ రాత్రి 7.20 గంటలకు సీఎం తన నివాసానికి చేరుకుంటారు.

News December 16, 2025

GNT: నిలకడగా స్క్రబ్ టైఫస్ రోగుల ఆరోగ్య పరిస్థితి

image

గుంటూరు జీజీహెచ్‌లో స్క్రబ్ టైఫస్ జ్వరాలతో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బుధవారం జీజీహెచ్‌కు వచ్చిన 13 మంది జ్వర బాధితుల నమూనాలను పరీక్షించగా, మంగళగిరి, అమృతలూరుకు చెందిన ఇద్దరికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ ఇద్దరిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.