News September 12, 2025
AP న్యూస్ రౌండప్

✶ శ్రీశైలం ప్రాజెక్టు, తుంగభద్ర, కాటన్ బ్యారేజ్, గోరకల్లు జలాశయం మరమ్మతులకు రూ.455Cr మంజూరు చేసిన ప్రభుత్వం.. వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల
✶ డిగ్రీ ప్రవేశాల గడువు 13వ తేదీ వరకు పొడిగింపు
✶ ఈ నెల 15, 16 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సదస్సు
✶ ఈడిగ, గౌడ (గమల్ల), కలలీ, గౌండ్ల, శెట్టిబలిజ, శ్రీశయన (సెగిడి) కులాల ముందు గౌడ్ అనే పదాన్ని తొలగిస్తూ ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం
Similar News
News December 11, 2025
అందుకే నరసింహ రైట్స్ అమ్మలేదు: రజినీకాంత్

రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ‘నరసింహ’ మూవీని రేపు రీరిలీజ్ చేస్తున్నారు. ‘సినీ కెరీర్ స్టార్ట్ అయ్యి 50 ఏళ్లు. నరసింహ రిలీజై 25 ఏళ్లు పూర్తయ్యాయి. థియేటర్లలో ఈ సినిమా చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకోవాలి. అందుకే డిజిటల్ రైట్స్ ఇవ్వలేదు’ అని సినిమా హీరో, ప్రొడ్యూసర్, రచయిత రజినీకాంత్ చెప్పారు. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్లో క్యారెక్టర్ స్ఫూర్తితో నీలాంబరి పాత్ర రాసినట్టు తెలిపారు.
News December 11, 2025
తల్లిలో ఈ లోపం ఉంటే బిడ్డకు గుండె జబ్బులు

కొందరు చిన్నారుల్లో పుట్టుకతోనే గుండెజబ్బులు వస్తాయి. తల్లికి ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ ఉండటం, కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తల్లిలో థయమిన్ డెఫిషియన్సీ ఉంటే బిడ్డకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. థయమిన్ని విటమిన్ బీ1 అని కూడా అంటారు. కాబట్టి ప్రెగ్నెన్సీలో విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
News December 11, 2025
ఓవర్స్పీడ్తోనే 1.24 లక్షల మరణాలు.. రాజ్యసభలో కేంద్ర మంత్రి

2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.77 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 1.24 లక్షల మరణాలకు ఓవర్ స్పీడ్ కారణమన్నారు. 69,088 మంది సీట్బెల్ట్, హెల్మెట్ వాడకపోవడం వల్ల మరణించారని రాజ్యసభలో చెప్పారు. స్పీడ్ డ్రైవింగ్ మరణాల్లో తమిళనాడు టాప్లో, కర్ణాటక, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయన్నారు. 2023లో తగ్గిన మరణాలు ఈ ఏడాది మళ్లీ పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.


