News May 2, 2024
భారత్ను ఇరకాటంలో పెట్టేందుకే ఆ కథనాలా?- 1/2

భారత నిఘా వ్యవస్థపై అమెరికా, ఆస్ట్రేలియా మీడియా సంస్థలు ఇటీవల ప్రచురించిన కథనాలపై కేంద్ర వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు సమాచారం. భారత్ను ఇరకాటంలో పెట్టేందుకు ఆ దేశ ప్రభుత్వాలే పరోక్షంగా ఈ పని చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. భారత్ను అదుపులో పెట్టేందుకు ఆ దేశాలు ఎత్తుగడ వేసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయట. ఈ కథనాలపై ఆయా దేశ ప్రభుత్వాలు తటస్థంగా వ్యవహరించడం గమనార్హం.
Similar News
News December 16, 2025
BREAKING: భారత ప్లేయర్ విధ్వంసం.. డబుల్ సెంచరీ

U-19 ఆసియా కప్లో భాగంగా మలేషియాతో మ్యాచ్లో భారత ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అభిజ్ఞాన్ 121 బంతుల్లో డబుల్ సెంచరీ చేశారు. ఇందులో 16 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. 48వ ఓవర్లో అభిజ్ఞాన్, చౌహాన్ 29 పరుగులు బాదారు. వరుసగా 4, వైడ్, 6, 6, 6, వైడ్, 1, 4 రన్స్ వచ్చాయి.
News December 16, 2025
బీట్ రూట్ సాగులో కలుపు నివారణ ఎలా?

బీట్ రూట్లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు తేలిక నేలల్లో 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 1.25 లీటర్లు, అదే బరువు నేలల్లో అయితే 200 లీటర్ల నీటిలో అలాక్లోర్ 1.25L కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో మెట్రిబుజిన్ 300 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోస్తే గడ్డ బాగా ఊరుతుంది.
News December 16, 2025
99 పైసలకు భూములిస్తామంటే ఎగతాళి చేశారు: లోకేశ్

AP: అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ చెప్పారు. ఐటీ కంపెనీలన్నీ విశాఖకే వస్తున్నాయని తెలిపారు. CM CBN విజన్తో ముందుకెళ్తున్నారని చెప్పారు. భోగాపురంలో AAD ఎడ్యుసిటీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘కొంత మంది విజన్లెస్ మనుషులు విజనరీలను విమర్శిస్తారు. 99 పైసలకు భూములిస్తామంటే ఎగతాళి చేశారు. ఆ నిర్ణయంతోనే కాగ్నిజెంట్, TCS వచ్చాయి’ అని వెల్లడించారు.


