News August 13, 2025

ASF: ‘కాంట్రాక్టు సిబ్బంది సమస్యలు పరిష్కరించండి’

image

జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది 2 రోజులుగా సమస్యల పరిష్కారానికి AITUC ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, అలాగే పీఎఫ్, ఈఎస్ఐ వివరాలను స్పష్టం చేయాలని వారు కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకున్నారు.

Similar News

News March 12, 2026

యుద్ధం ఎఫెక్ట్.. వరంగల్ జిల్లాలో పెరిగిన వంట నూనె ధరలు!

image

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో వంట నూనె ధరలు మండిపోతున్నాయి. వరంగల్ జిల్లాలో ఈ ధరలు లీటరుకు రూ.15-25 వరకు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. గతంలో సన్‌ఫ్లవర్ రూ.145-155 ఉండగా ఇప్పుడు రూ.180కి పెరిగింది. పామాయిల్ రూ.100-110 ఉండగా, ఇప్పుడు రూ.160 వరకు పెరిగాయి. వేరుశనగ నూనె రూ.180కి పెరిగింది. హోల్ సెల్ వ్యాపారులు బ్లాక్ చేయడం వల్లే వంట నూనె ధరలు పెరుగుతున్నట్లు రిటైల్ వ్యాపారులు తెలిపారు.

News March 12, 2026

16న ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

image

AP: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర స్థాయి, అన్ని జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ విందుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 16న విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. జిల్లాల స్థాయిలో వచ్చే 5 రోజుల్లో కలెక్టర్లు తమకు అనువైన రోజున ఇఫ్తార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.

News March 12, 2026

జీకేవీధి: ఊబ పొలం..ఊటనిరే ఆధారం

image

అల్లూరి జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ మంచినీటికి ఇబ్బందులు తప్పడం లేదు. గుక్కెడు మంచినీటికి అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి ఆయా గ్రామాల గిరిజనులది. అలా అల్లూరి జిల్లా రింతాడ పంచాయతీ ఊబపొలం గ్రామంలో మంచినీటి మంచినీళ్లు దొరక్క పొలాల గట్ల వద్ద ఊరే ఊట నీటినే ఆధారంగా జీవిస్తున్నారు. వర్షం వస్తే ఆ ఊట నీరు బురదగా మారుతున్నాయని స్థానిక మహిళలు తెలిపారు. మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు