News December 3, 2025
ASF: డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్

డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్లో అధిక కేసులు పరిష్కారానికి జిల్లాలోని అన్ని కోర్టుల కృషి చేయాలని ASF జిల్లా న్యాయమూర్తి రమేష్ తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా పోలీస్, అటవీశాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ లోక్ అదాలత్ పై అందరికీ అవగాహన కల్పించాలని కోరారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకొని తమ కేసులని పరిష్కరించుకొని శాంతియుతంగా జీవనం సాగించాలన్నారు.
Similar News
News February 18, 2026
సారంగాపూర్: దుబ్బరాజన్న హుండీ లెక్కింపు పూర్తి

పెంబట్ల-కోనాపూర్ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు బుధవారం జరిగినట్టు ఈఓ వి.అనూష తెలిపారు. టికెట్ల ద్వారా రూ.27,38,312=00, హుండీ ద్వారా రూ.21,27,684=00, వేలం ద్వారా రూ.12,71,000=00, మొత్తం రూ.61,36,996=00, గత సంవత్సరం కంటే రూ.1,43,008=00 అధికంగా సమకూరింది. మిశ్రమ బంగారం 33గ్రా.510మి.,మిశ్రమ వెండి 7.580 కి.గ్రా. సమకూరింది. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News February 18, 2026
అన్నమయ్య: రంజాన్ వేళ.. ఉర్దూ మీడియం స్కూల్ వేళల్లో మార్పులు

రంజాన్ మాసం సందర్భంగా అన్నమయ్య జిల్లాలోని అన్ని ఉర్దూ మాధ్యమ పాఠశాలలు రేపు ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహిస్తారని DEO సుబ్రమణ్యం తెలిపారు. ఈ సమయాలు రంజాన్ కాలానికి మాత్రమే వర్తిస్తాయి. పదో తరగతి యాక్షన్ ప్లాన్పై స్పష్టత వచ్చే వరకు స్లిప్ టెస్టులు యథావిధిగా నిర్వహించాలన్నారు. ముస్లిం ఉద్యోగులకు ప్రతిరోజూ ఒక గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.
News February 18, 2026
ఈక్రాప్ నమోదును వేగంగా పూర్తి చేయాలి: నెల్లూరు కలెక్టర్

ఈ క్రాప్ నమోదును వేగంగా పూర్తిచేయాలని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకూరుపేట మండలం కొరుటూరు పంచాయతీలో ఆన్లైన్లో నమోదు చేసిన పంట వివరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ-పంట యాప్ నుంచి రైతుల వివరాలను డౌన్లోడ్ చేసుకొని నమోదు చేసేటప్పుడు ఆధార్ ఫోన్ నెంబర్ సరిచూడాలన్నారు. రైతు గండవరపు అమర్నాథ్ రెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకురాలు ఝాన్సీ పాల్గొన్నారు.


