News May 13, 2024
హెచ్డీ రేవణ్ణకు బెయిల్

మహిళ కిడ్నాప్ కేసులో అరెస్టైన కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన బెంగళూరు కోర్టు ష్యూరిటీ కింద రూ.5 లక్షల బాండ్ సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారులకు సహకరించాలని తీర్పులో పేర్కొంది.
Similar News
News December 9, 2025
నేటి నుంచి లారీల బంద్

AP: టెస్టింగ్, ఫిట్నెస్ ఛార్జీలను తగ్గించాలనే డిమాండ్తో ఇవాళ అర్ధరాత్రి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేస్తున్నట్లు లారీ ఓనర్ల సంఘం ప్రకటించింది. దాదాపు 10వేల లారీలు నిలిచిపోనుండటంతో కూరగాయలు, నిత్యావసరాలు, ధాన్యం, రేషన్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది. 13 ఏళ్ల వాహనాల ఫిట్నెస్ ఫీజు గతంలో రూ.1,400 ఉండగా కొత్త నిబంధనల ప్రకారం రూ.33వేలు చెల్లించాల్సి వస్తోందని లారీల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News December 9, 2025
గడప పూజ ఎప్పుడు చేయాలి?

మార్గశిర మాసంలో గురువారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. అదే రోజు గడప పూజ కూడా చేస్తే పూజా ఫలంతో పాటు లక్ష్మీ వ్రత ఫలితం కూడా లభిస్తుందని నమ్మకం. శ్రావణ, కార్తీక, మార్గశిర మాసాల్లో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన శుక్రవారం రోజు కూడా ఈ పూజ ప్రారంభించడం శుభకరమేనని పండితులు చెబుతున్నారు. బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజకు అధిక ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ద్వార లక్ష్మీ పూజ వరుసగా 16 రోజులు చేయాలి.
News December 9, 2025
రూ.40 వేల కోట్లు ఇచ్చాం: కేంద్రం

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 2వ తేదీ నాటికి ఏపీకి మొత్తం రూ.40,337 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. లోక్సభలో BJP MP దగ్గుబాటి పురందీశ్వరి ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కోసం ఇప్పటివరకు రూ.20,650 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఏపీకి బకాయిలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు.


