News March 11, 2025
భారత్ భళా: చిప్ డిజైన్ రీసెర్చ్ పేపర్ల పబ్లిషింగ్లో 3rd ర్యాంక్

టెక్నాలజీ పరంగా భారత్ అరుదైన ఘనత సాధించింది. 2018-2023 మధ్య చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్పై ఎక్కువ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేసిన మూడో దేశంగా అవతరించింది. జపాన్, సౌత్ కొరియా, జర్మనీని వెనక్కి నెట్టింది. భారత ఆథర్స్ 39,709 పేపర్స్ కాంట్రిబ్యూట్ చేశారు. మొత్తం 4,72,819 పేపర్స్లో ఇది 8.4% అన్నమాట. చైనా 1,60,852 (34%)తో No 1గా నిలిచింది. భారత్ చిప్ తయారీపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News March 12, 2026
మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్

కరోనా కాలంలో మొదలై ఇప్పుడిప్పుడే పూర్తిగా తగ్గుతున్న వర్క్ ఫ్రం హోమ్ విధానం గ్యాస్ కొరతతో మళ్లీ తెరపైకి వస్తోంది. ఇవాళ, రేపు WFH చేయాలని చెన్నై ఆఫీస్ ఎంప్లాయీస్కి HCL టెక్ మెయిల్ చేసింది. క్యాంపస్లోని కేఫ్లో గ్యాస్ కొరతే దీనికి కారణమని పేర్కొంది. చెన్నైతో పాటు HYD, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లోని ప్రముఖ సంస్థలనూ గ్యాస్ షార్టేజ్ వేధిస్తోంది. దీంతో WFHలు పెరిగే అవకాశం ఉంది.
News March 12, 2026
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక వార్నింగ్

గత 8 ఏళ్లుగా అసత్య ప్రచారం చేస్తూ ఆన్లైన్లో వ్యక్తిగతంగా అటాక్ చేస్తూ వేధిస్తున్నారని రష్మిక వాపోయారు. 24గంటల్లో వేధింపులు మితిమీరిపోయాయని పేర్కొన్నారు. తన ఫ్యామిలీని కూడా లాగారని, ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు. 24గంటల్లో ఆ కంటెంట్ను తొలగించకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ X వేదికగా వార్నింగ్ ఇచ్చారు. రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ రద్దు వార్తలపైనే ఆమె ఇలా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది.
News March 12, 2026
చామంతి మొక్కల తలల కత్తిరింపుతో కలిగే లాభం

చామంతి సాగులో అధిక దిగుబడి రావాలంటే మొక్కల తలల కత్తిరింపు తప్పక చేపట్టాలి. పొలంలో మొక్కలన్నీ 30 సెంటీమీటర్లు దాకా పెరిగిన తర్వాత వాటి తలలను తుంచేయాలి. దీని వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ఫలితంగా పూల దిగుబడి కూడా పెరుగుతుంది. మొక్కల తలలను తుంచాక నిపుణుల సూచనలతో నత్రజని, పొటాష్ ఎరువులను తగిన మోతాదులో అందిస్తే నాణ్యమైన పువ్వులను పొందవచ్చు.


