News March 31, 2024

BIG BREAKING: తప్పిన భారీ రైలు ప్రమాదం

image

TG: కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గర రైలు పట్టా విరిగిపోయింది. విచిత్రమైన శబ్ధం రావడంతో ప్రయాణికులు అప్రమత్తమై సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే రైలును నిలిపివేసి పట్టా విరిగిన ప్రాంతాన్ని గుర్తించారు. మరమ్మతులు చేసిన తర్వాత రైలు బయలు దేరింది. విరిగిన పట్టాను గుర్తించకపోతే పెద్ద ప్రమాదం జరిగేదని అధికారులు చెప్పారు.

Similar News

News February 18, 2026

వెంటిలేటర్‌పై సల్మాన్ ఖాన్ తండ్రి?

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత <<19165776>>సలీమ్ ఖాన్<<>> (90) వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఉదయం అస్వస్థతకు గురవడంతో ముంబైలోని లీలావతీ ఆస్పత్రికి తరలించారు. రేపు ఉదయం ఆపరేషన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సలీమ్ ఖాన్ ఎన్నో హిట్ చిత్రాలకు కథ, మాటలు రాశారు.

News February 18, 2026

2050 నాటికి ఉద్యోగాలే ఉండవు: వినోద్ ఖోస్లా

image

AI ప్రభావంపై టెక్ బిలియనీర్ వినోద్ ఖోస్లా షాకింగ్ కామెంట్స్ చేశారు. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మనుషులకు ఉద్యోగాల అవసరమే ఉండదని ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్’లో అన్నారు. IT సేవలు, BPO రంగాలు వచ్చే ఐదేళ్లలో పూర్తిగా కనుమరుగవుతాయని స్పష్టం చేశారు. మనిషి మేధస్సుతో చేసే పనులనే కాకుండా రోబోల సాయంతో శారీరక శ్రమను కూడా AI భర్తీ చేస్తుందన్నారు. ఫలితంగా విద్య, వైద్యం వంటి సేవలు ఉచితమవుతాయని పేర్కొన్నారు.

News February 18, 2026

2050 నాటికి ఉద్యోగాలే ఉండవు: వినోద్ ఖోస్లా

image

AI ప్రభావంపై టెక్ బిలియనీర్ వినోద్ ఖోస్లా షాకింగ్ కామెంట్స్ చేశారు. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మనుషులకు ఉద్యోగాల అవసరమే ఉండదని ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్’లో అన్నారు. IT సేవలు, BPO రంగాలు వచ్చే ఐదేళ్లలో పూర్తిగా కనుమరుగవుతాయని స్పష్టం చేశారు. మనిషి మేధస్సుతో చేసే పనులనే కాకుండా రోబోల సాయంతో శారీరక శ్రమను కూడా AI భర్తీ చేస్తుందన్నారు. ఫలితంగా విద్య, వైద్యం వంటి సేవలు ఉచితమవుతాయని పేర్కొన్నారు.