News April 13, 2024
సీఎం రేవంత్కు BJP ఎమ్మెల్యే సవాల్

TG: సీఎం రేవంత్రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 14 సీట్లు తెప్పిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఒకవేళ 14 ఎంపీ సీట్లు రాకపోతే సీఎం సీటు వదులుకుంటారా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 10 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భూకబ్జాలు, సెటిల్మెంట్ల కోసమే రేవంత్ CM అయ్యారని మహేశ్వర్రెడ్డి ఆరోపించారు.
Similar News
News December 10, 2025
ఆ లెక్కలు చంద్రబాబు సృష్టే: జగన్

AP: 2025-26 ఏడాదికి ప్రభుత్వం ఇచ్చిన GSDP అంచనాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని YCP చీఫ్ జగన్ మండిపడ్డారు. ‘ప్రజలను మోసం చేసేందుకే ఈ గణాంకాలను CBN మార్గదర్శకత్వంలో తయారు చేశారు. కాగ్ నివేదికలు నిజమైన ఆదాయాలు, ఖర్చులను ప్రతిబింబిస్తున్నాయి. వాటి ప్రకారం ఆదాయాల పెరుగుదల తగ్గి, అప్పులు పెరిగాయి. అభివృద్ధి కోసం పెట్టే ఖర్చు, పెట్టుబడులు తగ్గాయి. రెవెన్యూ లోటు ఆందోళనకరంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
News December 10, 2025
బుమ్రా అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్గా

టీమ్ ఇండియా దిగ్గజ పేసర్ జస్ప్రిత్ బుమ్రా అరుదైన రికార్డు నమోదు చేశారు. SAతో జరిగిన తొలి టీ20లో బ్రెవిస్ని ఔట్ చేసి 100 వికెట్స్ క్లబ్లో చేరారు. భారత్ తరఫున అర్ష్దీప్ తర్వాత ఈ ఘనత సాధించింది బుమ్రానే కావడం విశేషం. అలాగే అన్ని ఫార్మాట్లలో వంద వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్గా అరుదైన రికార్డు నెలకొల్పారు. బుమ్రా కంటే ముందు లసిత్ మలింగ, టిమ్ సౌథీ, షకీబ్ అల్ హసన్, షాహీన్ అఫ్రిది ఉన్నారు.
News December 10, 2025
న్యాయ వ్యవస్థను బెదిరిస్తారా: పవన్ కళ్యాణ్

DMK ఆధ్వర్యంలోని ఇండీ కూటమి MPలు మద్రాస్ హైకోర్టు జడ్జిపై అభిశంసన నోటీసు ఇవ్వడాన్ని AP Dy.CM పవన్ ఖండించారు. “ఇది న్యాయవ్యవస్థ మొత్తాన్ని భయపెట్టే యత్నం కాదా? ఇలాంటప్పుడు భక్తులు తమ ఆలయాలను, మత వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించేందుకు, రాజకీయ ద్వేషంతో ప్రేరితమైన న్యాయ దుర్వినియోగాలకు గురవకుండా ఉండేందుకు ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు దేశానికి అత్యవసరం” అని <


