News November 25, 2024
సంభాల్ హింసకు BJPదే బాధ్యత: రాహుల్ గాంధీ

UP సంభాల్ హింసకు BJPదే బాధ్యతని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అడ్మినిస్ట్రేషన్ అన్ని పక్షాల వాదనను పట్టించుకోలేదని, సరిగ్గా వ్యవహరించలేదని విమర్శించారు. హిందూ ముస్లిముల మధ్య BJP విభేదాలు సృష్టిస్తోందన్నారు. సుప్రీంకోర్టు త్వరగా జోక్యం చేసుకోవాలని కోరారు. స్థానిక కోర్టు ఆర్డర్తో జామా మసీదును సర్వే చేయడానికి వచ్చిన అధికారులపై ముస్లిములు రాళ్లతో దాడిచేశారు. ఈ ఘర్షణల్లో నలుగురు మరణించారు.
Similar News
News July 8, 2025
జైలులో కాకాణికి తోడుగా ఉంటా: ప్రసన్న కుమార్ రెడ్డి

AP: TDP MLA <<16988626>>వేమిరెడ్డి ప్రశాంతి<<>>పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని YCP నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ‘ప్రశాంతి నాపై కేసులు పెట్టినా, కోర్టుకు వెళ్లినా ఫర్వాలేదు. మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదు. నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపితే కాకాణి గోవర్ధన్ రెడ్డికి తోడుగా ఉంటా’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News July 8, 2025
సిగాచీలో ముగిసిన NDMA బృందం పరిశీలన

TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో NDMA బృందం పరిశీలన ముగిసింది. ప్రమాద స్థలాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడుకు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది. కాగా ఈ ఘటనలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 44కు చేరింది. ప్రమాదం జరిగి 9 రోజులవుతున్నా ఇంకా పలువురి ఆచూకీ లభ్యం కాలేదు.
News July 8, 2025
ఇంటర్నెట్ లేకుండా పనిచేసే మెసేజింగ్ యాప్!

ట్విటర్ మాజీ CEO జాక్ డోర్సే సరికొత్త మెసేజింగ్ యాప్ను రూపొందించారు. ‘బిట్చాట్’ పేరుతో రూపొందిన ఈ యాప్కు ఇంటర్నెట్, ఫోన్ నంబర్లు, సర్వర్లు అవసరం లేదు. కేవలం బ్లూటూత్ నెట్వర్క్లలో పనిచేసే పీర్-టు-పీర్ మెసేజింగ్ యాప్ ఇది. ప్రస్తుతం ఈ యాప్ టెస్టింగ్ దశలో ఉంది. బిట్చాట్ అనేది గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే, ఆఫ్-గ్రిడ్ కమ్యూనికేషన్ కోసం రూపొందించినదని జాక్ చెబుతున్నారు.