News August 5, 2024
బ్లడ్ బాత్: రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి

అమెరికాలో మాంద్యం భయాలు తలెత్తడంతో ఆసియా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇప్పటికే భారత మార్కెట్ రూ.10 లక్షల కోట్లను కోల్పోయినట్లు అంచనా. జపాన్ 10శాతం, దక్షిణ కొరియా, తైవాన్ చెరో 8శాతం నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 2500 పాయింట్లు, నిఫ్టీ 800 పాయింట్ల మేర నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.80కి పడిపోయింది. పలు ప్రధాన సంస్థల షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి.
Similar News
News December 11, 2025
అందుకే నరసింహ రైట్స్ అమ్మలేదు: రజినీకాంత్

రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ‘నరసింహ’ మూవీని రేపు రీరిలీజ్ చేస్తున్నారు. ‘సినీ కెరీర్ స్టార్ట్ అయ్యి 50 ఏళ్లు. నరసింహ రిలీజై 25 ఏళ్లు పూర్తయ్యాయి. థియేటర్లలో ఈ సినిమా చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకోవాలి. అందుకే డిజిటల్ రైట్స్ ఇవ్వలేదు’ అని సినిమా హీరో, ప్రొడ్యూసర్, రచయిత రజినీకాంత్ చెప్పారు. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్లో క్యారెక్టర్ స్ఫూర్తితో నీలాంబరి పాత్ర రాసినట్టు తెలిపారు.
News December 11, 2025
తల్లిలో ఈ లోపం ఉంటే బిడ్డకు గుండె జబ్బులు

కొందరు చిన్నారుల్లో పుట్టుకతోనే గుండెజబ్బులు వస్తాయి. తల్లికి ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ ఉండటం, కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తల్లిలో థయమిన్ డెఫిషియన్సీ ఉంటే బిడ్డకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. థయమిన్ని విటమిన్ బీ1 అని కూడా అంటారు. కాబట్టి ప్రెగ్నెన్సీలో విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
News December 11, 2025
ఓవర్స్పీడ్తోనే 1.24 లక్షల మరణాలు.. రాజ్యసభలో కేంద్ర మంత్రి

2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.77 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 1.24 లక్షల మరణాలకు ఓవర్ స్పీడ్ కారణమన్నారు. 69,088 మంది సీట్బెల్ట్, హెల్మెట్ వాడకపోవడం వల్ల మరణించారని రాజ్యసభలో చెప్పారు. స్పీడ్ డ్రైవింగ్ మరణాల్లో తమిళనాడు టాప్లో, కర్ణాటక, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయన్నారు. 2023లో తగ్గిన మరణాలు ఈ ఏడాది మళ్లీ పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.


