News May 1, 2024
ఢిల్లీలో వంద స్కూళ్లకు బాంబు బెదిరింపులు!

ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపిన నేపథ్యంలో మరో సంచలన విషయం బయటపడింది. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) పరిధిలోని దాదాపు 100 స్కూళ్లకు ఇలా బెదిరింపులు వచ్చాయట. యాజమాన్యాలకు ఈ-మెయిల్స్ పంపి దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారట. ఇవి రష్యా నుంచి వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా సోమవారం ఢిల్లీలోని పలు ఆస్పత్రులకు సైతం ఇలాగే మెయిల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు.
Similar News
News December 9, 2025
గడప పూజ ఎప్పుడు చేయాలి?

మార్గశిర మాసంలో గురువారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. అదే రోజు గడప పూజ కూడా చేస్తే పూజా ఫలంతో పాటు లక్ష్మీ వ్రత ఫలితం కూడా లభిస్తుందని నమ్మకం. శ్రావణ, కార్తీక, మార్గశిర మాసాల్లో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన శుక్రవారం రోజు కూడా ఈ పూజ ప్రారంభించడం శుభకరమేనని పండితులు చెబుతున్నారు. బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజకు అధిక ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ద్వార లక్ష్మీ పూజ వరుసగా 16 రోజులు చేయాలి.
News December 9, 2025
రూ.40 వేల కోట్లు ఇచ్చాం: కేంద్రం

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 2వ తేదీ నాటికి ఏపీకి మొత్తం రూ.40,337 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. లోక్సభలో BJP MP దగ్గుబాటి పురందీశ్వరి ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కోసం ఇప్పటివరకు రూ.20,650 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఏపీకి బకాయిలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు.
News December 9, 2025
సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

AP: ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. నిన్న ఈ ఏడాదిలోనే అత్యల్పంగా అల్లూరి(D) దళపతిగూడలో 3.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ 3-4డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. వాయవ్య భారతం నుంచి మధ్య భారతం వరకు అధిక పీడనం కొనసాగడం వల్ల గాలులు వీస్తున్నాయని, ఫలితంగా చలి పెరిగిందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 13వ తేదీ వరకు చలి కొనసాగుతుందని పేర్కొంది.


