News November 14, 2025

BREAKING: శంషాబాద్ విమానాశ్రయంలో FULL EMERGENCY ప్రకటన

image

లండన్ నుంచి HYD వచ్చే BA 277 (STA 05:20) విమానానికి బాంబ్ బెదిరింపు కారణంగా ఈరోజు ఉదయం 4:46 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. 5:10 గంటలకు 167 మంది ప్రయాణికులు, ఇద్దరు శిశువులు, ఇద్దరు కాక్‌పిట్ సిబ్బంది, 8 కేబిన్ సిబ్బందితో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానాన్ని ప్రస్తుతం ఐసోలేషన్ బేకు తరలించి తనిఖీ చేస్తున్నారు.

Similar News

News November 14, 2025

హైదరాబాద్‌లో పెరుగుతున్న చలి తీవ్రత!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. నేడు తెల్లవారుజామున అత్యల్పంగా శేరిలింగంపల్లి HCU పరిసర ప్రాంతాల్లో 8.8C నమోదు కాగా, రాజేంద్రనగర్‌లో 10.7, BHEL 11.7, బొల్లారం, మారేడ్‌పల్లి, గచ్చిబౌలి 11.7, కుత్బుల్లాపూర్ 12.2, జీడిమెట్ల 12.7 సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News November 14, 2025

హైదరాబాద్‌లో పెరుగుతున్న చలి తీవ్రత!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. నేడు తెల్లవారుజామున అత్యల్పంగా శేరిలింగంపల్లి HCU పరిసర ప్రాంతాల్లో 8.8C నమోదు కాగా, రాజేంద్రనగర్‌లో 10.7, BHEL 11.7, బొల్లారం, మారేడ్‌పల్లి, గచ్చిబౌలి 11.7, కుత్బుల్లాపూర్ 12.2, జీడిమెట్ల 12.7 సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News November 14, 2025

4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ ఎంఓయూ

image

4 గిగావాట్ల పునరుద్పాతక విద్యుత్ రంగంలో పెట్టుబడులకు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.15వేల కోట్ల వ్యయంతో కర్నూలు, అనంతపురం, కడపలో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్ సీఎం చంద్రబాబుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఓర్వకల్లులో క్రియేటివ్‌ సెన్సార్‌ ఇంక్‌ సంస్థ ఇమేజ్‌ సెన్సార్‌ తయారీ యూనిట్‌ను స్థాపించనుంది.