News March 28, 2024

BREAKING: గుండెపోటుతో ఎంపీ మృతి

image

తమిళనాడు ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి (77) గుండెపోటుతో మరణించారు. మూడు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఆయనకు ఈ ఉదయం గుండెపోటు వచ్చింది. కొయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. 2019లో డీఎండీకే తరఫున ఈరోడ్ నుంచి పోటీ చేసి గెలిచిన గణేశమూర్తికి ఈసారి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన మార్చి 24న పురుగు మందు తాగారు.

Similar News

News February 17, 2026

బిల్ గేట్స్ టూర్.. SMలో తీవ్ర విమర్శలు!

image

మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ నిన్న <<19155078>>అమరావతి<<>>లో పర్యటించడం తెలిసిందే. అయితే ఆయన భారత టూర్‌పై SMలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో గేట్స్ పేరు చాలా సార్లు ఉండటమే ఇందుకు కారణం. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్న అలాంటి వ్యక్తితో ఎవరూ భేటీ కాకూడదని MP కాంగ్రెస్ నేత అనూప్ ధోటే ట్వీట్ చేశారు. తన ఉత్పత్తుల కోసం ఇండియాను ల్యాబ్‌లా ఆయన చూస్తారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

News February 17, 2026

లెజెండరీ నటుడు కన్నుమూత!

image

హాలీవుడ్ లెజెండరీ నటుడు రాబర్ట్ డువల్(95) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. తన 60 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 100 చిత్రాల్లో ఆయన నటించారు. హాలీవుడ్ గ్రేట్ మూవీస్ ‘ది గాడ్ ఫాదర్‌’, ‘ది గాడ్ ఫాదర్‌-2’లో కనిపించారు. టెండర్ మెర్సీస్ సినిమాకు ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. మరో 6 సార్లు నామినేట్ అయ్యారు.

News February 17, 2026

దేవుడిపైనే భారం: మిచెల్ మార్ష్

image

శ్రీలంకతో కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా <<19162360>>ఓడిపోవడం<<>>పై ఆ జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందించారు. ‘మంచి స్టార్టింగ్ వచ్చినా కొన్ని పరుగులు తక్కువ చేశాం. కానీ స్కోరును డిఫెండ్ చేసుకోవచ్చని అనుకున్నాం. శ్రీలంక బాగా ఆడింది. ఇక దేవుడిపైనే భారం. జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచ్‌ను ఆశతో చూస్తాం. ప్రస్తుతం నిరాశలో ఉన్నాం’ అని మ్యాచ్ అనంతరం చెప్పారు. జింబాబ్వే గెలుపోటములపైనే ఆసీస్ S-8 అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.