News August 4, 2024
విద్యార్థులకు బంపర్ ఆఫర్.. రూ.10,000 పొందే ఛాన్స్

ఇన్స్పైర్-మనక్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు రూ.10,000 సాయం అందిస్తోంది. 6-10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు దీని ద్వారా సైన్స్పై ఆసక్తిని పెంచాలని భావిస్తోంది. దీంతో రీసెర్చ్, టెక్నాలజీపై వారు ఫోకస్ పెడతారని అంచనా వేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ కోసం SEP 15 వరకు దరఖాస్తు చేయవచ్చు. వివరాలకు ఇక్కడ <
Similar News
News December 8, 2025
2026 DECకు పూర్తి కానున్న విశాఖ-రాయ్పూర్ ఎక్స్ప్రెస్వే

విశాఖపట్నం-రాయ్పూర్ (ఛత్తీస్గఢ్) ఎక్స్ప్రెస్వే పనులు 2026 చివరి నాటికి పూర్తి కానున్నాయి. రూ.16,482 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆర్థిక కారిడార్ను కేంద్రం చేపట్టింది. మొత్తం 597 KM మార్గాన్ని 465KMకి తగ్గిస్తూ 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవేగా నిర్మిస్తోంది. దీంతో AP, ఒడిశా, ఛత్తీస్గఢ్ మధ్య ప్రయాణ సమయం దాదాపు 7 గంటలు తగ్గుతుంది. టూరిజం, పారిశ్రామిక రవాణా, వ్యాపార అవకాశాలకు పెద్ద ఊతం లభించనుంది.
News December 8, 2025
పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల ఉత్పత్తికి అవసరమయ్యే ఆక్సిటోసిన్ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో అధిక వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.
News December 8, 2025
ఇవాళ్టి మ్యాచులకు నో ఎంట్రీ!

HYDలోని ఉప్పల్, జింఖానా మైదానాల్లో SMATలో భాగంగా ఇవాళ 4 మ్యాచులు జరగనున్నాయి. అయితే ప్రేక్షకులను అనుమతించకూడదని HCA నిర్ణయించింది. DEC 2న పంజాబ్, బరోడా మధ్య మ్యాచ్ జరగ్గా హార్దిక్, అభిషేక్ను చూడటానికి భారీగా ఫ్యాన్స్ వచ్చారు. సరైన సెక్యూరిటీ లేక పలువురు గ్రౌండులోకి వెళ్లి ప్లేయర్లతో సెల్ఫీలు సైతం దిగారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత దృష్యా ఆడియన్స్ను అనుమతించకూడదని నిర్ణయించినట్లు HCA తెలిపింది.


