News April 4, 2024

‘జీరో’ అయిన బైజూస్ హీరో

image

భారతదేశపు ఎడ్‌టెక్ దిగ్గజం ‘బైజూస్’ వ్యవస్థాపకుడు రవీంద్రన్ జీరోకి పడిపోయారు. అతడి నెట్‌వర్త్ రూ.17,545కోట్ల నుంచి సున్నాకి మారిందని ఫోర్బ్స్ బిలియనీర్ ఇండెక్స్‌లో వెల్లడైంది. కరోనా సమయంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు డిమాండ్ పెరగడంతో బైజూస్ ఒక వెలుగు వెలిగింది. ఒకప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్‌టెక్ సంస్థగా నిలిచిన బైజూస్ మనీలాండరింగ్ ఆరోపణలతో ఇటీవల తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది.

Similar News

News February 7, 2026

9th విద్యార్థులకు మార్చిలోనే టెన్త్ పాఠాలు

image

AP: వచ్చే విద్యాసంవత్సరంలో 6-8 క్లాసుల సిలబస్, ఆ తర్వాతి ఏడాది 9,10 తరగతుల పాఠ్యాంశాలు మారతాయని విద్యాశాఖ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా జూన్‌లో టీచర్లకు శిక్షణకు ఇస్తామని తెలిపింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి 12 తర్వాత 9వ తరగతి స్టూడెంట్లకు టెన్త్ పాఠాలు బోధించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడంపై దృష్టిపెట్టాలని ఆదేశించింది.

News February 7, 2026

సకల దోష నివారణ మార్గం ‘సూర్య గ్రహ శాంతి’

image

జాతకంలో సూర్య దోషాలు ఉన్నవారు, సూర్య మహాదశ నడుస్తున్న వారు భాను సప్తమి నాడు సూర్య గ్రహ శాంతి పూజ, యజ్ఞం నిర్వహించడం శుభప్రదం. సూర్యుడు జాతకంలో ఆత్మకారకుడు, అధికారానికి చిహ్నం. ఈ రోజున చేసే జపం, హోమం వల్ల ప్రతికూల ప్రభావాలు తొలగి, సమాజంలో గౌరవం, వృత్తిలో విజయం లభిస్తాయి. ఈ హోమంలో పాల్గొనడం ద్వారా జాతకంలోని రవి నీచ స్థితి, గ్రహణ దోషాలు హరించుకుపోతాయి. జీవితంలో కొత్త వెలుగులు నిండుతాయి.

News February 7, 2026

జామలో తెల్ల సుడిదోమ వల్ల నష్టాలు – నివారణ

image

తెల్ల సుడిదోమ ఆకుల అడుగు భాగాన వలయాకారంలో గుడ్లను పెడతాయి. ఆకులపై తెల్లని దూదిలాంటి మెత్తని పదార్ధాన్ని కప్పి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులు ఎర్రబడి, ముడతలు పడి రాలిపోతాయి. వీటి నివారణకు రాత్రివేళ పసుపు రంగు జిగురు పూసిన అట్టలను చెట్ల వద్ద ఉంచాలి. సుడిదోమ ఆశించిన కొమ్మలను కత్తిరించి లీటరు నీటిలో 5ml వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. ఇమిడాక్లోప్రిడ్-75% WGని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.