News March 18, 2024
పోలింగ్ బూత్ మార్చుకోవచ్చా?

ఈ సందేహం చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో నలుగురు ఓటర్లు ఉంటే.. వారు కొన్నిసార్లు వేర్వేరు పోలింగ్ బూత్లలో ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే పోలింగ్ కేంద్రాన్ని మార్చుకునే హక్కు ఓటర్లకు లేదని ఎన్నికల సంఘం పేర్కొంది. పోలింగ్ స్టేషన్ను నిర్ణయించే అధికారం జిల్లా రిటర్నింగ్ అధికారికి మాత్రమే ఉంటుంది. కాబట్టి మీకు కేటాయించిన కేంద్రంలో మాత్రమే మీరు ఓటు వేయాల్సి ఉంటుంది.
Similar News
News December 5, 2025
అఖండ-2 సినిమా రిలీజ్ వాయిదా

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడింది. రేపు రిలీజ్ కావాల్సిన సినిమాను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ట్వీట్ చేసింది. ఈ సినిమా <<18466572>>ప్రీమియర్స్<<>>ను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించగా తాజాగా రిలీజ్ను కూడా వాయిదా వేశారు.
News December 5, 2025
టుడే టాప్ స్టోరీస్

*రష్యా అధ్యక్షుడు పుతిన్ను రిసీవ్ చేసుకున్న ప్రధాని మోదీ
*హార్టికల్చర్ హబ్కి కేంద్రం రూ.40వేల కోట్లు ఇస్తోంది: చంద్రబాబు
*తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది: జగన్
*ఏడాదిలోగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు పనులు ప్రారంభం: రేవంత్
*’హిల్ట్’ పేరుతో కాంగ్రెస్ భూకుంభకోణం: KTR
*మరోసారి కనిష్ఠానికి రూపాయి.. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూ.90.43కి పతనం
News December 5, 2025
క్రియేటివ్ సిటీగా అమరావతి: చంద్రబాబు

AP: అమరావతిలో నిర్మించే ప్రతి భవనం విలక్షణంగా ఉండాలని, పచ్చదనంతో ప్రస్ఫుటంగా కనిపించేలా ఉండాలని CRDA భేటీలో CM CBN సూచించారు. మౌలిక సదుపాయాల కోసం నాబార్డు ₹7,380 కోట్ల రుణానికి ఆమోదం తెలిపిందని చెప్పారు. నాణ్యతలో రాజీపడకుండా గడువుకన్నా ముందే నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు. తెలుగు ఆత్మగౌరవానికి, వైభవానికి ప్రతీకగా నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.


