India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
13, 14న జమ్మూలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు రాయచోటి పట్టణానికి చెందిన యువ క్రీడాకారుడు షేక్ అలీ అహ్మద్ ఎంపికయ్యాడు. శనివారం అలీ అహ్మద్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో జరిగే కబడ్డీ పోటీలలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అనేక జట్లు పాల్గొంటున్నాయన్నారు. ఈ కబడ్డీ పోటీలలో విజయం సాధించి రాయచోటికి మంచి తెస్తానన్నారు.
తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ కళాశాలలో ఈ నెల పది నుంచి జాయింట్ సీట్ అలాట్మెంట్ అథారిటీ (జోసా) కౌన్సిలింగ్ నిర్వహించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ దినేశ్ శంకర్ రెడ్డి శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 480 సీట్లకు గాను 50 శాతం రాష్ట్ర విద్యార్థులతోనూ, మిగిలిన 50 శాతం ఇతర రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేయనున్నట్లు వివరించారు.
తిరుపతి : మీడియా మొగల్, రామోజీ గ్రూప్స్ సంస్థ అధినేత రామోజీరావు శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన తన జీవిత ప్రస్థానంలో అనేక పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ఇందులో భాగంగా 1989వ సంవత్సరం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రామోజీరావుకు గౌరవ డాక్టరేట్ ను అందజేసింది.
అరకు, పాడేరు నియోజకవర్గాలు YCPకి కంచుకోటగా మారాయి. రెండింటిలోనూ YCP ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 2014 నుంచి YCP పోటీలో నిలవగా.. 3సార్లు వేర్వేరు అభ్యర్థులే పోటీచేసి గెలిచారు. అరకులో 2014లో కిడారి సర్వేశ్వరరావు, 2019లో చెట్టి ఫాల్గుణ, 2024లో రేగం మత్స్యలింగం గెలిచారు. ఇటు పాడేరులో 2014 గిడ్డి ఈశ్వరి, 2019లో భాగ్యలక్ష్మి, 2024లో విశ్వేశ్వర రాజు గెలిచారు. అరకు MP స్థానంలో కూడా ఇదే ఫార్ములా నడిచింది.
అరకు, పాడేరు నియోజకవర్గాలు YCPకి కంచుకోటగా మారాయి. రెండింటిలోనూ YCP ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 2014 నుంచి YCP పోటీలో నిలవగా.. 3సార్లు వేర్వేరు అభ్యర్థులే పోటీచేసి గెలిచారు. అరకులో 2014లో కిడారి సర్వేశ్వరరావు, 2019లో చెట్టి ఫాల్గుణ, 2024లో రేగం మత్స్యలింగం గెలిచారు. ఇటు పాడేరులో 2014 గిడ్డి ఈశ్వరి, 2019లో భాగ్యలక్ష్మి, 2024లో విశ్వేశ్వర రాజు గెలిచారు. అరకు MP స్థానంలో కూడా ఇదే ఫార్ములా నడిచింది.
రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్యామల శనివారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు.
అనంతపురం వైసీపీ నాయకుడు అనిల్ గౌడ్ సతీమణి ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్యామల తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ ఓటమి చెందడంతో రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో తన రాజీనామా పత్రాన్ని అందించారు.
గాజులదిన్నె ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జీడీపీలోకి దాదాపు 1100 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరినట్లు ఏఈ మహమ్మద్ అలీ తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో 0.7 టీఎంసీలకు చేరిందని వెల్లడించారు. 4.5 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాల కోసం కర్నూలుకు 30 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు తెలిపారు.
నెల్లూరు జిల్లాలోని పోలీసు సిబ్బంది సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా భావించి “పోలీస్ వెల్ఫేర్ డే” ని జిల్లా యస్.పి. ఆరీఫ్ హఫీజ్ నిర్వహిస్తున్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు. సిబ్బంది నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించి, వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. పారదర్శకతతో కోరుకున్న చోటుకే ఖాళీల ఆధారంగా స్థానచలనం చేశారు.
తుడా ఛైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యుడి పదవికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేశారు. తుమ్మల గుంటలోని వారి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ప్రజల కోసం కష్టపడ్డామని, 980 కోట్లరూపాయలతో చంద్రగిరి నియోజకవర్గంలో కనీస సౌకర్యాలు కల్పించామన్నారు. కరోనా కాలంలోనూ ప్రజలను ఆదుకున్నామని అన్నారు. పులివర్తి నానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
లా సెట్ పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నట్లు లా సెట్ కన్వీనర్ తెలిపారు. నంద్యాలలోని శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తామన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.