India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావుకు విశాఖతో విడదీయరాని అనుబంధం ఉంది. పత్రికా రంగంలో కొత్త ఒరవడలు సృష్టించిన ఈనాడు దినపత్రిక విశాఖ నుంచే ఆయన ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆ పత్రిక అపూర్వ ప్రజాధరణ పొందింది. అదేవిధంగా నగరంలో డాల్ఫిన్ హోటల్ను ఆయన ఏర్పాటు చేశారు. ఇప్పటికీ నగరంలో ఎన్ని హోటల్స్ ఉన్నప్పటికీ ఆ డాల్ఫిన్ హోటల్కు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది.
రామోజీరావు మృతి నేపథ్యంలో ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని మాజీ మంత్రి రోజా గుర్తు చేసుకున్నారు. ‘రామోజీరావు గారి మరణం సినీ, పాత్రికేయ రంగానికి తీరనిలోటు. ఉషాకిరణ్లో పని చేసిన నాటి రోజుల నుంచి ప్రతి ఇంట నవ్వులు పూయించిన జబర్దస్త్ వరకు వారితో ఉన్న నా అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటున్నా. వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. Rip Sir’ అని ట్వీట్ చేశారు.
విశాఖ ఆర్.కె బీచ్లో గుర్తు తెలియని ఓ యువకుడి మృతదేహం కొట్టుకువచ్చింది. నలుపురంగు టీషర్ట్ వేసుకొని.. చేతిపై జైశ్రీరాం అని పచ్చబొట్టు ఉందని మహారాణిపేట ఎస్.ఐ లక్ష్మీ తెలిపారు. ముఖంపై గాయాలను గుర్తించామని వెల్లడించారు. మృతుని వివరాలు తెలిసినవారు మహారాణిపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. 94407 96010, 83310 41628 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
ఈనాడు గ్రూప్ అధినేత, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత డా.రామోజీరావు మృతిపై కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఓ శకం ముగిసింది. కానీ వారసత్వం జీవిస్తుంది. లెజెండరీ రామోజీరావు కన్నుమూశారు. ఆయనను కలవడం గొప్ప గౌరవం’ అని కలెక్టర్ రాసుకొచ్చారు. గతంలో రామోజీరావును తన భర్త రవితేజతో కలిసిన ఓ ఫోటోను కలెక్టర్ సృజన ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకి ఉండి నియోజకవర్గ MLA కనుమూరి రఘురామ కృష్ణరాజు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 నెలల క్రితం ఆయనతో కలిసి 2 గంటల పాటు మాట్లాడిన మాటలు ఇప్పటికీ తనకు గుర్తొస్తున్నాయని అన్నారు. గొప్ప పట్టుదల, క్రమశిక్షణ, వ్యక్తిత్వం కోటికి ఒక్కరిలోనే ఉంటాయని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
పోలీస్ సేవా యాప్ కొన్నిరోజులుగా పనిచేయకపోవడంతో దాని స్థానంలో కొత్త యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్రం ఈ యాప్ తెచ్చింది. ప్రస్తుతం దీని ద్వారానే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి అపరాధ రుసుం విధిస్తున్నారు. వాహన బీమా సొల్యూషన్, కేసులు గత బకాయిలు దీనిలోనే తెలుస్తాయి. కొత్త యాప్లోనే అపరాధ రుసుం విధిస్తున్నట్లు శ్రీకాకుళం నగర ట్రాఫిక్ ఎస్సై వి.సందీప్ చెప్పారు.
కురబలకోట రైల్వే స్టేషన్లో సుమారు 25 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. కదిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ భాషా కథనం మేరకు.. అర్ధరాత్రి కురబలకోట రైల్వే స్టేషన్ నేమ్ బోర్డు సమీపంలో గుర్తు తెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని మృతిచెందినట్లు సమాచారం అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఈ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, కిలారి రోశయ్య బరిలో నిలవగా.. పెమ్మసాని 2,82,085 ఓట్ల మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ లోక్సభ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో NDA ఎమ్మెల్యే అభ్యర్థుల(857213) కంటే.. ఎంపీ అభ్యర్థికి(864948) ఓట్లు ఎక్కువగా వచ్చాయి. మంగళగిరిలో రెండింటి మధ్య 4775 ఓట్ల వ్యత్యాసం కనిపించింది.
పాత్రికేయ రంగంలో చెరగని ముద్రవేసిన ఈనాడు అధినేత రామోజీరావు మరణవార్త ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోందని BJP రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి సంతాపం ప్రకటించారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. సినీరంగంలో ఎంతోమంది కళాకారులను పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి రామోజీ రావు అని.. ఆయన లేరన్న వార్త తెలుగుజాతిని శోకసంద్రంలో ముంచి వేసిందన్నారు.
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ అవార్డు-2025 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమాధికారి కరుణ కుమారి తెలిపారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవలు, ఇంజినీరింగ్, ప్రజా సంబంధాలు, సివిల్ సర్వీసెస్, ట్రేడ్, ఇండస్ట్రీ రంగాల్లో ఉత్తమ సేవలు చేసి ఉండాలన్నారు. రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ https://awards.gov.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
Sorry, no posts matched your criteria.