Andhra Pradesh

News June 8, 2024

అనంత: ఎమ్మెల్యేలకు కలిసొచ్చిన ‘S‘ అక్షరం

image

అనంతపురం జిల్లాలో టీడీపీ నుంచి నలుగురు మహిళలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. కాగా వారి అందరి పేర్లు ‘S’ అక్షరంతో మెుదలవడం విశేషంగా చెప్పవచ్చు. రాప్తాడు నియోజకవర్గం నుంచి సునీత, పెనుకొండ నుంచి సవిత, శింగనమల నుంచి శ్రావణిశ్రీ, పుట్టపర్తి నుంచి సింధూర రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. వీరిలో పెనుకొండ నుంచి సవిత 33వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.

News June 8, 2024

మద్దికేర: ఒక్కరోజు ఎస్సైగా మాత్రమే విధులు

image

మద్దికేర పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటరామిరెడ్డి ఎస్ఐగా పదోన్నతి పొంది ఒక్క రోజు మాత్రమే పని చేశాడు. 31వ తేదీన జిల్లా ఉన్నతాధికారులు ఎస్ఐగా పదోన్నతి ఇచ్చారు. అదే రోజు పదవి విరమణ చేశారు. అయితే ఎక్కడ కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోవడంతో మద్దికెర స్టేషన్‌లోనే పదవి విరమణ పొందారు. డి. ఎస్. పి సీఐ ఎస్ఐలు తోపాటు, సిబ్బంది బంధుమిత్రులు ఆయనను సత్కరించడం జరిగింది.

News June 8, 2024

CTR: ITIలో ప్రవేశాలకు ఎల్లుండే చివరి తేదీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐ కళాశాలలో ప్రవేశాలకు ఈనెల 10వ తేదీతో ముగుస్తుందని జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అర్హులని సూచించారు. ఆసక్తి కలిగిన వారు www.iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ చేసుకునేవారు తప్పనిసరిగా వెరిఫికేషన్ చేసుకోవాలని అన్నారు.

News June 8, 2024

ఏనుగులు ఎటాక్.. చాకచక్యంగా వ్యవహరించిన రైతు 

image

కురుపాం నియోజకవర్గంలో ఏనుగుల బెడద రోజురోజుకు పెరుగుపోతుంది. జియ్యమ్మవలస మండలం గౌరీపురం వద్ద ఎడ్లబండితో వెళ్తున్న రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది. పెదకుదమ గ్రామానికి చెందిన బోను తిరుపతిరావు శుక్రవారం ఇసుక కోసం నాటుబండిపై వెళ్తుండగా ఏనుగులు ఎటాక్ చేశాయి. చాకచక్యంగా వ్యహరించిన రైతు ఎడ్లు తాలు విప్పి వాటిని తోలేసి.. తానూ ప్రాణాలను కాపాడుకున్నాడు. కాగా.. ఏనుగులు నాటుబండిని ధ్వంసం చేశాయి.

News June 8, 2024

ప.గో.: గురుకులాల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో 2024- 25 విద్యాసంవత్సరానికి గాను 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 20న నరసాపురం గురుకులంలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శైలజ తెలిపారు. రిజర్వేషన్ కేటగిరీ, మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఈ నెల 15వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 8, 2024

ఆలూరు నియోజకవర్గం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు

image

సార్వత్రిక ఎన్నికల్లో ఆలూరు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యేగా చిప్పగిరి మండల కేంద్రానికి చెందిన విరూపాక్షి, ఆలూరు మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ IAS ఆఫీసర్ బర్ల రామాంజనేయులు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామానికి చెందిన గుమ్మనూరు జయరాం గుంతకల్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

News June 8, 2024

గుడివాడలో డిగ్రీ వరకు చదివిన రామోజీరావు

image

కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించిన రామోజీరావు గుడివాడలోనే డిగ్రీ వరకు చదువుకున్నారు. తల్లిదండ్రులు ఆయనకు రామయ్య అని పేరు పెట్టగా.. పాఠశాలలో తన పేరు రామోజీరావు అని చెప్పి పరిచయం చేసుకున్నారు. ఇలా తన పేరును తానే పెట్టుకున్నారు. ఈ తెల్లవారుజామున రామోజీ మరణంతో కృష్ణా జిల్లాలోని ఆయన సన్నిహితులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

News June 8, 2024

విశాఖ నుంచే ఈనాడు ప్రస్థానం

image

రామోజీ సంస్థల పేరుతో అనేక వ్యాపారాలు చేసిన రామోజీరావుకు ఈనాడు ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. 1974 ఆగస్టు 10న విశాఖలో సీతమ్మధార సమీపంలోని నక్కవానిపాలెం ఈనాడు ఆఫీసును ప్రారంభించారు. మొదట 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. అప్పట్లో చాలా పత్రికల పేర్లు ఆంధ్ర పదంలో మొదలయ్యేవి. దానికి భిన్నంగా అచ్చమైన తెలుగు పదంతో ప్రారంభించిన ఈనాడుకి ఈ ఆగస్టు 10కి యాభై ఏళ్లు. ఆ పండగ చూడకుండానే రామోజీ కన్నుమూశారు.

News June 8, 2024

ప్రకాశం: ఆ స్థానాల్లో టీడీపీ, వైసీపీలకు గెలుపు అందని ద్రాక్ష

image

ప్రకాశం జిల్లాలోని పర్చూరు, చీరాలలో వైసీపీ, వైపాలెంలో టీడీపీ ఇంతవరకు ఖాతాలు తెరవలేదు. 2009లో డీలిమిటేషన్‌లో కొత్తగా వైపాలెం నియోజకవర్గం ఏర్పడింది. అప్పటినుంచి టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఒకసారి, మూడుసార్లు వైసీపీ గెలిచింది. అలాగే చీరాలలో వైసీపీ వచ్చాక జరిగిన మూడు ఎన్నికలలో ఒక్కసారి కూడా ఆ పార్టీ గెలవలేదు. ఇక పర్చూరులోనూ వైసీపీకి ఆశాభంగమే ఎదురైంది.

News June 8, 2024

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ముస్తాబాద్-గన్నవరం రైల్వే సెక్షన్ మధ్య ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున నం.11019 కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌ శుక్రవారం నుంచి జూన్ 29 వరకు విజయవాడ-ఏలూరు- తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ- గుడివాడ మార్గం గుండా ఈ ట్రైన్ నిడదవోలు చేరుకుంటుందన్నారు. జూన్ 29 వరకు ఈ ట్రైన్‌కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని పేర్కొన్నారు.