India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీడీపీ జైత్రయాత్రలో భాగస్వామి అయినందుకు యువ సినీ హీరో, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అల్లుడు సిద్ధార్థ్ నిఖిల్ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. శుక్రవారం మాలకొండయ్యతో కలిసి నిఖిల్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో లోకేశ్ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్తో లోకేశ్ సరదాగా ముచ్చటించారు. సినిమాల్లో హీరో మాదిరే రియల్గా ప్రజలకు మేలు చేయాలన్నారు.
తణుకు పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు తణుకు బ్రాంచిలో మేనేజర్గా పని చేస్తున్న రూపాదేవి శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి నుంచి బ్యాంక్కు స్కూటీపై వెళుతుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రూపాదేవి తలకు గాయం కావడంతో తొలుత తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు తరలించారు.
ప్రొద్దుటూరుకు చెందిన పలువురు రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు YCP ఓటమితో శుక్రవారం రాజీనామా చేశారు. నగర కార్పొరేషన్ డైరెక్టర్ మురళి,ఆరెకటిక కార్పొరేషన్ డైరెక్టర్ ఉమామహేశ్వరి, తొగటవీర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ రవిచంద్ర, పూసల కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటరమణ, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి, అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ ప్రతాప్రెడ్డి, నాటక అకాడమీ డైరెక్టర్ లక్ష్మీదేవి రాజీనామా చేశారు.
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో బీ-ఫార్మసీ(2017-18 రెగ్యులేషన్) కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. జూలై 25 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు టైం టేబుల్, ప్రాజెక్టు వర్క్ షెడ్యూల్ పూర్తి వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు.
దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం గూడ్స్ రైలు ఢీకొనగా గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు విజయనగరం రైల్వే ఎస్సై రవివర్మ తెలియజేశారు. రైలు పట్టులు దాటుతుండగా మృతి చెందినట్లు చెప్పారు. గూడ్స్ రైలు లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద నవ్యాంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 12 ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు టీడీపీ నేతలు టీడీ జనార్దన్, అచ్చెన్నాయుడు తదితరులు శుక్రవారం కేసరపల్లిలో ఎంపిక చేసిన సభాస్థలాన్ని పరిశీలించారు.
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన లోకం నాగ మాధవి కేవలం 7వేల ఓట్లకే పరిమితమయ్యారు. 2024లో టిక్కెట్ దక్కించుకున్న ఆమె.. తన చరిష్మాతో నియోజకవర్గమంతా తిరిగి ప్రజాభిమానాన్ని సంపాదించారు. ముఖ్యంగా పరిశ్రమలు పెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చి యువతను తన వైపు ఆకర్షించారు. ఫలితంగా 1,09,915 ఓట్లు సాధించి భారీ విజయాన్ని అందుకున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అభినందించారు. శుక్రవారం ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే, మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. తనని కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారితో మాట్లాడిన అనంతరం లోకేశ్ ఫోటో దిగారు. కార్యక్రమంలో సినీ నిర్మాత బండ్ల గణేశ్, హీరో నిఖిల్ పాల్గొన్నారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన నాయకులు దాడులకు పాల్పడుతున్నారని, వారికి అండగా నిలిచేందుకు మాజీ సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అధ్యక్షుడిగా జంకే వెంకట్ రెడ్డి, కమిటీ ఇన్ఛార్జ్గా చెవిరెడ్డి, కమిటీ సభ్యులుగా మాజీ మంత్రి బాలినేని, ఆదిమూలపు సురేశ్, అన్నా రాంబాబు, తాటిపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. వీరు న్యాయపరంగా, ఆర్థికంగా బాధితులకు అండగా ఉంటారని జగన్ తెలిపారు.
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ వైసీపీ నాయకులు సొంగ సందీప్ లిడ్ క్యాంప్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని, కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి తమవంతు కృషి చేస్తానని అన్నారు.
Sorry, no posts matched your criteria.