India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సాధారణ ఎన్నికలు-2024 నిర్వహణలో ఉపయోగించిన ఈవీఎం, వీవీప్యాట్లను కట్టుదిట్టమైన భద్రతతో గోదాములో భద్రపరిచినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ డిల్లీరావు వెల్లడించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తయినందున.. గొల్లపూడిలోని గోదాములో ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరిచి శుక్రవారం సీల్ వేశారు.
భారత రక్షణ మంత్రికి మాజీ సాంకేతిక సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ జి. సతీష్ రెడ్డికి ఇస్రో ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక స్పేస్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ జీవితకాల సభ్యత్వంతో సత్కరించింది. అహ్మదాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్, అసోసియేట్ డైరెక్టర్ సింగ్ తదితర శాస్త్రవేత్తల బృందం సతీష్ రెడ్డి సేవలను ప్రశంసించారు.
బీజేపీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జి రెడ్డి శుక్రవారం మరణించారు. ఆయనకు గుండెపోటు రావడంతో హఠాత్తుగా మరణించారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులతో పాటు పలువురు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సంతాపం తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు.
టీచర్లను బదిలీ చేస్తామంటూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారని విశాఖ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.3నుంచి 6 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై టీచర్లు ఫిర్యాదు చేసారన్నారు. ఈ కుంభకోణంలో ఉన్న వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సమావేశంలో గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాసరావు పాల్గొన్నారు.
విజయనగరం ఎంపీగా గెలుపొందిన కలిశెట్టి అప్పలనాయుడు డబుల్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇంతవరకు ఇక్కడ MPలుగా గెలిచిన వారెవరికీ రాని మెజార్టీ అప్పలనాయుడు సాధించడం ఒకటి కాగా, శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం MPగా ఎన్నికైన తొలి నాయకుడిగా రికార్డు సృష్టించారు. అప్పలనాయుడు YCP ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ మీద 2,38,216 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే.
మోదకొండమ్మ జాతర సందర్భంగా రేపటి నుంచి ఐదు రోజులపాటు పాడేరు ఘాట్లో భారీ వాహనాలను నిషేధించామని కలెక్టర్ విజయ సునీత తెలియజేశారు. అమ్మవారి జాతర ఈనెల 9,10,11 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లపై ఉత్సవ కమిటీతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఉత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులతో పాటు ఉత్సవ కమిటీకి సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ ఛైర్మన్ పదవికి, క్యాబినెట్ హోదాకు వడ్డీ రఘురాం నాయుడు శుక్రవారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీకి అందజేసినట్లు వివరించారు. 2026 మార్చి వరకు తన పదవీకాలం ఉన్నప్పటికీ స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
తాడేపల్లి పరిధి బ్రహ్మానందపురం వద్ద ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారులు సభా స్థలాన్ని పరిశీలించారు. 80 కంటే ఎక్కువ వాహనాలలో సభా ఏర్పాట్లకు సంబంధించిన సామగ్రి చేరుకుంది. సుమారు 200 ఎకరాల ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్డీఏ కూటమి ప్రముఖులు హాజరుకానున్నారు.
ఉత్తరాంధ్రాలో వేల కోట్ల రూపాయల విలువ చేసే వందల ఎకరాల అసైన్డ్ భూములు జీవో 596 ముసుగులో కొట్టేసిన ఐఏఎస్లపై నిఘా పెట్టాలని, సంబంధిత ఫైళ్లు మాయం కాకుండా విశాఖ, విజయనగరం జిల్లాల కలక్టరేట్ల నుంచి అసైన్డ్ ఫైళ్లు స్వాధీనం చేసుకోవాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండు చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలంలో అదుపుతప్పి పోలీసులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. సోమందేపల్లి మండల పరిధిలోని పూలే కమ్మ గుడి వద్ద పెనుకొండ డిఎస్పీ బాబిజాన్ సైదా, కానిస్టేబుళ్లు సోమందేపల్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్వల్ప గాయాలైన వారిని చికిత్స నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.