Andhra Pradesh

News June 5, 2024

కర్నూలు: కొనసాగిస్తారా..? కొత్తవారిని తీసుకుంటారా..?

image

రాజీనామాలు చేసిన వాలంటీర్లను టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందా, లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వాలంటీర్లు దాదాపు అందరూ రాజీనామా చేశారు. టీడీపీ వచ్చాక రూ.పదివేలు వేతనం ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో రూ.5 వేలతో బాధ్యతగా పనిచేస్తూనే రాజీనామా చేసిన వారిని తీసుకుంటారా లేక టీడీపీ నేతలు సిఫారసు మేరకు కొత్తవారికి అవకాశం ఇస్తారా అన్నది వేచి చూడాలి.

News June 5, 2024

తూ.గో జిల్లాలో రేపు, ఎల్లుండి వర్షాలు

image

రేపు, ఎల్లుండి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఈ మేరకు APSDMA తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సైతం తేలికపాటి వర్షాలు పడతాయని స్పష్టం చేశారు.

News June 5, 2024

మదనపల్లె: ఉరి వేసుకుని ఆత్మహత్య

image

కుటుంబ సమస్యలతో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మదనపల్లె మండలంలో జరిగిందని సీఐ శేఖర్ తెలిపారు. కోటవారిపల్లె తండాకు చెందిన చిన్నరెడ్డప్పనాయక్ కుమారుడు కృష్ణానాయక్(35) ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా జీవితంపై విరక్తి చెందాడు. భార్య అమ్రూ కూలి పనులకు వెళ్లడంతో ఇంట్లోనే చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిచూడగా భర్త చనిపోవడంతో బోరున విలపించింది.

News June 5, 2024

విశాఖ: పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించిన రైల్వే

image

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని రైల్వే అధికారులు ఘనంగా నిర్వహించారు. డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద పర్యావరణ ప్రాధాన్యత తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైల్లో ప్రయాణికులకు చేతి సంచులను పంపిణీ చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రచారం జరిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు మంజు శ్రీ ప్రసాద్ నేతృత్వంలో మొక్కలు నాటారు.

News June 5, 2024

నారా లోకేశ్‌ను కలిసిన తిరుపతి ఎమ్మెల్యే

image

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అమరావతిలో కలిశారు. మంగళగిరి నుంచి భారీ మెజారిటీతో గెలిచిన లోకేశ్‌ను ఆరణి శ్రీనివాసులు దుశ్శాలువతో సత్కరించారు. తిరుపతి నుంచి ఘన విజయం సాధించిన ఆరణి శ్రీనివాసులును లోకేశ్ అభినందించారు. తిరుపతి అభివృద్ధికి అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని నారా లోకేశ్ ఆరణి శ్రీనివాసులుకు భరోసా ఇచ్చారు.

News June 5, 2024

పాలకొల్లు: ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మృతి

image

పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గంటా ప్రభాకర్ (61)విధి నిర్వహణలో గుండెపోటుకు గురై మృతి చెందారు. బుధవారం ఆయన ఆసుపత్రిలో గుండె పోటు రాగా హుటాహుటిన పాలకొల్లు న్యూలైఫ్ హాస్పిటల్‌కి తరలించారు. వైద్య సేవలందిస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్, వైద్యులు, సిబ్బంది తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

News June 5, 2024

కృష్ణా జిల్లాలో కృష్ణప్రసాద్‌లు ఇద్దరూ కొట్టేశారు..

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం, పెడనలో టీడీపీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన వసంత కృష్ణప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్‌లిద్దరూ గెలుపొందారు. వీరి తండ్రులు వసంత నాగేశ్వరరావు, కాగిత వెంకట్రావులు సైతం గతంలో టీడీపీ నుంచి గెలిచారు. తాజా ఎన్నికల్లో కాగిత పెడనలో 38,123 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాముపై, వసంత మైలవరంలో 42,829 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిపై గెలిచారు.

News June 5, 2024

నెల్లూరు జిల్లాలో అత్యల్ప, అత్యధిక మెజార్టీలు వీరికే

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 10 స్థానాల్లో గెలిచింది. వీరిలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణకు (72,489) అత్యధిక మెజార్టీ ఓట్లు లభిస్తే.. ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (7,576) అత్యల్ప మెజార్టీ ఓట్లతో గెలిచారు. ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణకు ఇది తొలి విజయం.

News June 5, 2024

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్ ఢిల్లీ రావు

image

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ కలెక్టరేట్లో గుడ్డ, నారతో చేసిన పర్యావరణహిత సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని అరికట్టాలన్నారు. గుడ్డ, నారతో చేసిన సంచులనే వాడాలన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహిత జీవన శైలి అలవర్చుకోవాలన్నారు.

News June 5, 2024

కమలాపురం:  చికిత్స పొందుతూ ఫీల్డ్ అసిస్టెంట్ మృతి 

image

కమలాపురం మండలం పెద్దచెప్పలిలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఆది భాస్కర్ (52) మృతి చెందినట్లు ఏపీవో సారధి తెలిపారు. ఏపీవో వివరాల మేరకు..  అనారోగ్యంతో కడప హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ భాస్కర్ బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.