India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ప.గో.లోని 15 స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి నలుగురు పోటీచేయగా అందరూ ఓడిపోయారు.
☛ అసెంబ్లీ స్థానం
✦ పోలవరంలో వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి
✦ గోపాలపురంలో వైసీపీ అభ్యర్థి తానేటి వనిత ఓడిపోయారు.
☛ పార్లమెంట్
✦ ఏలూరులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె.లావణ్య 20826ఓట్లతో 3వ స్థానానికి పరిమితమయ్యారు.
✦నరసాపురంలో వైసీపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల 4,30,541 ఓట్లతో 2వ స్థానంలో నిలిచింది.
శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీస్ శాఖ సిబ్బంది సమిష్టిగా పనిచేయడం వల్ల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించిన జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయడం హర్షనీయమన్నారు.
విశాఖ సిరిపురం టైక్వాన్ జంక్షన్ వద్ద మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణాలకు అనుకూలంగా స్టాప్బోర్డులను ఏర్పాటు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్కడికి చేరుకున్నారు. వారే స్వయంగా వీటిని తొలగించడానికి ప్రయత్నించారు. ఈలోపు అక్కడకు పోలీసులు చేరుకున్నారు. కాగా..సిరిపురం నుంచి రేసపువానిపాలెం వైపు వెళ్లే మార్గానికి మధ్యలో స్టాపర్లను గతంలో ఏర్పాటు చేశారు.
2009లో ఏర్పడ్డ పామర్రు నియోజకవర్గంలో 2024లో తొలిసారి టీడీపీ గెలిచింది. గత 3 ఎన్నికల్లో ఇక్కడ ఓడిన టీడీపీకి తాజా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా తొలి విజయాన్ని అందించారు. 2014లో పామర్రులో టీడీపీ తరపున పోటీ చేసిన వర్ల కుమార్ రాజా తండ్రి రామయ్య 1,069 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాడు రామయ్యను ఓడించిన పామర్రు ఓటర్లు.. నేడు అతని కుమారుడు కుమార్ రాజాను 29,690 ఓట్ల మెజారిటీతో గెలిపించారు.
మడకశిర మండల పరిధిలోని గుర్రప్పకొండ గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం సగం కాల్చినట్టు గుర్తించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
కడప జిల్లాలో ఎవరు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారంటే..
* అరవ శ్రీధర్: మొదటి సారి
* పుత్తా చైతన్య రెడ్డి: మొదటి సారి
* రెడ్డప్పగారి మాధవిరెడ్డి: మొదటి సారి
* మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి: మొదటి సారి
* పుట్టాసుధాకర్ యాదవ్: మొదటి సారి
* దాసరి సుధ: రెండోసారి
* వైఎస్ జగన్: మూడోసారి
* ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి: మూడోసారి
* ఆదినారాయణ రెడ్డి: నాలుగోసారి
* నంద్యాల వరదరాజుల రెడ్డి: ఆరోసారి
ఉమ్మడి తూ.గో జిల్లా నుంచి నలుగురు మహిళామణులు విజయకేతం ఎగురవేశారు. వీరిలో ముగ్గురు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనుండగా.. ఒకరు పార్లమెంట్లో గళం వినిపించనున్నారు.
➠ పార్లమెంట్ స్థానం
☞ రాజమండ్రి- పురందీశ్వరి(BJP) (మెజార్టీ-2,39,139)
➠ అసెంబ్లీ స్థానాలు
☞ ప్రత్తిపాడు- వరుపుల సత్యప్రభ(TDP) (38,768+)
☞ తుని- యనమల దివ్య(TDP) (15,177 +)
☞ రంపచోడవరం-శిరీషాదేవి(TDP) (9,139+)
ఉమ్మడి ప.గో. జిల్లా ఆచంట మాజీ MLA పితాని సత్యనారాయణ ప్రస్తుత విజయంతో 4వ సారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అలాగే తాజా విజయంతో వరుసగా 3 సార్లు గెలిచిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈసారి హ్యాట్రిక్ సాధించారు. తరువాతి వరుసలో దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, భీమవరం నుంచి పులపర్తి అంజిబాబు 3వ సారి అసెంబ్లీకి వెళ్తున్నారు.
నంద్యాల తొలి మహిళా MPగా బైరెడ్డి శబరి రికార్డు నెలకొల్పారు. ఆమె తాత బైరెడ్డి శేషశయనారెడ్డి నందికొట్కూరు MLAగా 3సార్లు గెలిచారు. తండ్రి బైరెడ్డి రాజశేఖరరెడ్డి 1994, 1999లో TDP తరఫున నందికొట్కూరు MLAగా విజయం సాధించారు. శబరి 2014లో పాణ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత BJPలో చేరి ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇటీవల TDPలో చేరి నంద్యాల MPగా 1,36,278 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన సాధారణ ఎన్నికల్లో నాలుగు వేర్వేరు పార్టీలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో నెల్లిమర్ల నియోజకవర్గం ఏర్పడింది. 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, 2019లో వైసీపీ, 2024లో జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
Sorry, no posts matched your criteria.