Andhra Pradesh

News June 5, 2024

గుంటూరు పార్లమెంటులో తొలిసారి 60.68 శాతంతో విజయం

image

గుంటూరు ఎంపీ స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గల్లా జయదేవ్ వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై 4,205 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో నెగ్గారు. అయితే 2024లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని.. రోశయ్యపై 3,44,695 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. పెమ్మసానికి 60.68 శాతంతో భారీ మెజారిటీ సాధించారు.

News June 5, 2024

పిఠాపురం కంటే పెందుర్తిలోనే మెజార్టీ ఎక్కువ

image

జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో పెందుర్తిలోనే అత్యధిక మెజార్టీ సాధించింది. పెందుర్తిలో పంచకర్ల రమేశ్ బాబుకు.. పవన్‌కళ్యాణ్‌ కంటే 10 వేల ఓట్ల ఎక్కువ మెజార్టీ వచ్చింది. పంచకర్లకు 81,870 ఓట్ల మోజార్టీతో రాగా.. పవన్‌కు 70,279 మెజార్టీ వచ్చింది. ఉమ్మడి విశాఖలో మిగిన 3 స్థానాల్లో అనకాపల్లిలో కొణతాల-65,764, యలమంచిలిలో సుందరపు విజయ్‌-48,956, విశాఖ సౌత్‌లో వంశీకృష్ణ-64,594 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు.

News June 5, 2024

25 ఏళ్ల తరువాత కర్నూలు, నంద్యాల ఎంపీ స్థానాలు TDP కైవసం

image

1985లో నంద్యాల, కర్నూలు పార్లమెంట్ స్థానాల నుంచి మద్దూరు సుబ్బారెడ్డి, ఏరాసు అయ్యపురెడ్డి విజయం సాధించారు. 1989, 1991, 1996లో టీడీపీ గెలవలేకపోయింది. 1998లో నంద్యాలలో టీడీపీ గెలవగా.. కర్నూలులో కాంగ్రెస్ గెలిచింది. 1999లో కర్నూలు, నంద్యాల స్థానాల నుంచి కేఈ కృష్ణమూర్తి, భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. 2004, 2009, 2014, 2019లో ఓడిపోయింది. ప్రస్తుతం ఈ రెండు చోట్లా టీడీపీ గెలిచింది.

News June 5, 2024

అనంత జిల్లాలో గెలుపొందిన అభ్యర్థుల మెజార్టీలు ఇవే..!

image

అనంతపురం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయ ఢంకా మోగించింది. 8 స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుపొందారు.
☞ బండారు శ్రావణి శ్రీ 8,788
☞ అమిలినేని సురేంద్ర బాబు 37,734
☞ పయ్యావుల కేశవ్ 21,704
☞ పరిటాల సునీత 23,329
☞ జేసీ అస్మిత్ రెడ్డి 25,865
☞ గుమ్మనురు జయరాం 6,826
☞ కాలవ శ్రీనివాసులు 41,659
☞ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ 23,023

News June 5, 2024

CTR: ఎక్కడి నుంచి వచ్చామని కాదు..!

image

చిత్తూరు ఎంపీగా టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు ఘన విజయం సాధించారు. బాపట్లకు చెందిన ఆయన ఐఆర్ఎస్ ఉద్యోగిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. నాన్ లోకల్ అయిన ఆయన లోకల్‌గా ఉన్న వైసీపీ అభ్యర్థి రెడ్డప్పని 2.20 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓడించడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇకపై ఆయన జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటారని దగ్గుమళ్ల అనుచరులు చెబుతున్నారు.

News June 5, 2024

పల్నాడు: అప్పుడు 10%… ఇప్పుడు 10%

image

నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో లావు శ్రీకృష్ణదేవరాయలు వరుసగా రెండోసారి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలలో వైసీపీ, టీడీపీ మధ్య 10 శాతం ఓట్ల తేడా కనిపించింది. కాగా శ్రీకృష్ణదేవరాయలు 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాయపాటిపై కూడా 10 శాతం అదనంగా ఓట్లు పొంది గెలుపొందారు. గతంలో మెజారిటీ 1,35,220 కాగా ఈసారి మరింత పుంజుకుని 1,59,729కి పెరిగింది.

News June 5, 2024

శ్రీకాకుళం: ఆర్టీసీ ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విద్యార్థులకు అందించే బస్సు పాసులు నూతన విద్యా సంవత్సరంలో ఆర్టీసీ ఇచ్చే రాయితీలకు సంబంధించి పాత వెబ్‌సైట్ పనిచేయదని.. దాని స్థానంలో కొత్త వెబ్‌సైట్ తీసుకువస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.విజయ్ కుమార్ బుధవారం తెలిపారు. ఈనెల 6,7 తేదీల్లో పనిచేయదని 8 వ తేదీ నుంచి యథావిధిగా పనిచేస్తుందన్నారు. ఎంఎస్ టీ పాసులు మంజూరు మరింత సులభతరం అవుతుందన్నారు.

News June 5, 2024

కడప: తొలిసారి పోటీచేశారు గెలిచారు..!

image

కడప జిల్లా నుంచి తొలిసారి ముగ్గురు ఎమ్మెల్యేలుగా పోటీచేసి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. వారిలో కడప టీడీపీ నుంచి పోటీచేసిన రెడ్డప్పగారి మాధవిరెడ్డి, రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్, కమలాపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి ఉన్నారు. అలాగే అత్యధిక సార్లు (6) ఎమ్మెల్యేగా గెలిచి నంద్యాల వరద రాజులరెడ్డి YSR, బిజివేముల వీరారెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి సరసన చేరారు.

News June 5, 2024

ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

పెద్దారవీడు మండలంలోని గోబూరు గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు యర్రగొండపాలెం మండలం చెన్నారాయుడుపల్లె గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News June 5, 2024

పిఠాపురంలో TDP కౌన్సిలర్ కన్నుమూత

image

పిఠాపురం పట్టణంలోని స్థానిక 23వ వార్డు టీడీపీ కౌన్సిలర్ రాంబాబు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ విషయం తెలిసిన నాయకులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతి పట్ల రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.