India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కూటమి ప్రభంజనంలోనూ అల్లూరి జిల్లా ప్రజలు YCPకే పట్టం కట్టారు. అరకు MPగా గుమ్మ తనూజారాణి, MLAగా రేగం మత్స్యలింగం, పాడేరు MLAగా మత్య్సరాస విశ్వేశ్వరాజును గెలిపించారు. కాగా వీరు ముగ్గురూ తొలిసారిగా పార్లమెంటు, అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అల్లూరిలో YCP అభ్యర్థులే గెలుపొందుతూ వస్తున్నారు. వైసీపీ గెలిచిన 11 స్థానాల్లో 2 స్థానాలు అల్లూరి జిల్లాలోనే 2 స్థానాలు ఉండడం గమనార్హం.
ఉమ్మడి తూ.గో ప్రజలు కూటమికి స్పష్టమైన గెలుపునిచ్చారు. 19 నియోజకవర్గాల్లో ఎక్కడా YCP ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎన్నికల్లో బావ-బావమరిది సత్తాచాటారు. రాజమండ్రి సిటీ TDP అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ YCP అభ్యర్థి మార్గాని భరత్పై 71,404+ ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆదిరెడ్డి బావమరిది కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం MPగా గెలిచారు. రామ్మోహన్ నాయుడి సోదరినే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివాహం చేసుకున్నారు.
తోయక జగదీశ్వరీ విజయంతో కురుపాం కోటపై 30 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది. టీడీపీ నేతల కృషితో పాటు పుష్పశ్రీవాణి ఉన్న వ్యతిరేకతను తమ అనుకూలంగా మలచుకోవడంలో కూటమి నేతలు సక్సెస్ అయ్యారు. గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండకు చెందిన జగదీశ్వరీ ఎల్విన్ పేట MPTCగా ఉన్నారు. ఆర్థిక బలం లేకపోయినా చంద్రబాబు మన్ననలు, కూటమి సపోర్ట్, చివర్లో మాజీ ఎంపీ ప్రదీప్ దేవ్ కొడుకు వీరేశ్ చంద్రదేవ్ అండతో గెలుపొందారు.
కర్నూలు జిల్లాలోని టీడీపీ హవా కొనసాగింది. 7 నియోజకవర్గాల్లో 4 స్థానాల్లో విజయం సాధించింది. కర్నూలు నియోజకవర్గంలో టీజీ భరత్, పత్తికొండలో కేఈ శ్యాంబాబు, కోడుమూరులో బొగ్గుల దస్తగిరి, ఎమ్మిగనూరులో బీవీ జయనాగేశ్వర రెడ్డి గెలిచారు. వైసీపీ కేవలం మంత్రాలయంలో వై.బాలనాగిరెడ్డి, ఆలూరులో బీ.విరుపాక్షి, బీజేపీ పోటీ చేసిన ఒకేఒక్క స్థానం ఆదోనిలో పార్థసారథి విజయం సాధించారు.
విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమ 2019లో 25 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. తాజా ఎన్నికల్లో ఉమ 68,886 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్పై గెలుపొంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీతో నెగ్గిన ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు. అంతేకాక ఉమ సాధించిన 68,886 మెజారిటీ ఈ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజారిటీ కావడం విశేషం.
మాచర్ల నియోజకవర్గం నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన జూలకంటి బ్రహ్మారెడ్డి తండ్రి నాగిరెడ్డి, తల్లి దుర్గాంబ మాచర్ల ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 1972 ఎన్నికలలో ఇండిపెండెంట్గా పులి గుర్తుపై పోటీ చేసి జూలకంటి నాగిరెడ్డి గెలుపొందారు. అప్పటినుంచి ఆయనను పల్నాటి పులి అని పిలుస్తారు. 1999 ఎన్నికలలో నాగిరెడ్డి సతీమణి దుర్గాంబ టీడీపీ నుంచి గెలుపొందారు. తాజాగా బ్రహ్మారెడ్డి విజయం సాధించారు.
గుమ్మనూరు జయరామ్కు గుంతకల్లు ప్రజలు పట్టం కట్టారు. వైసీపీ అభ్యర్థిపై 6,826 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019లో కర్నూలు జిల్లా ఆలూరు నుంచి YCP తరఫున గెలిచి మంత్రిగా పనిచేశారు. 2024లో ఆలూరు నుంచి టికెట్ దక్కకపోవడంతో TDPలో చేరి గుంతకల్లు సీటు దక్కించుకున్నారు. గుమ్మనూరు బ్రదర్స్ నియోజవకవర్గంలో మకాం వేసి గెలుపునకు కష్టపడ్డారు. జిల్లా ఏదైనా విజయం తమదే అంటూ గుమ్మనూరు అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రైల్వేకోడూరు పట్టణానికి చెందిన సయ్యద్ అబూబకర్ మిస్టర్ కాంటినెంటల్ వరల్డ్ -2024 పోటీల్లో ద్వితీయ స్థానం సాధించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈనెల 2న థాయిలాండ్ లో జరిగిన పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా 32 దేశాల నుంచి పలువురు యువకులు పాల్గొనగా ద్వితీయ స్థానం సాధించారని చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఔన్నత్యాన్ని వివరించేలా నిర్వహించిన కార్యక్రమాలలో ప్రతిభ చూపడంతో రన్నరప్ సాధించినట్లు తెలిపారు.
పెందుర్తి సెంటిమెంట్ పంచకర్ల రమేశ్బాబు ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ నియోజకవర్గ నుంచి ఒకసారి గెలిచిన వ్యక్తి రెండో పర్యాయం గెలిచిన దాఖలాలు లేవు. దీనికి భిన్నంగా మంగళవారం వెలువడిన ఫలితాల్లో పంచకర్ల 81,870 ఓట్ల భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్పై విజయం సాధించారు. దీనితో పెందుర్తి నియోజకవర్గంలో పాత సెంటిమెంట్కి చెక్ పెడుతూ కొత్త చరిత్రను పంచకర్ల రచించారు.
సార్వత్రిక ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై పోటీ చేసిన 12 మందికి డిపాజిట్ గల్లంతైంది. చంద్రబాబు 48, 184 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. చంద్రబాబుకు 1,20,925 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి భరత్ 73, 586 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల గోవిందరాజులు 2,562 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. నోటాకు 2,111 ఓట్లు వచ్చాయి.
Sorry, no posts matched your criteria.