Andhra Pradesh

News March 16, 2024

YCP అభ్యర్థులను ప్రకటించనున్న ధర్మాన, నందిగం సురేశ్

image

కాసేపట్లో YCP MP, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఇడుపులపాయలో సీఎం జగన్ సమక్షంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ నందిగం సురేశ్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ వీళ్లిద్దరే అభ్యర్థులను ప్రకటించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. దీన్ని, సెంటిమెంట్‌గా భావిస్తున్న వైసీపీ మరోసారి వీరితోనే అభ్యర్థులను ప్రకటించనుంది.

News March 16, 2024

ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇడుపులపాయ చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయ చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాది వద్ద నివాళులు అర్పించేందుకు బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో సీనియర్ నాయకులు అభ్యర్థులను ప్రకటించనున్నారు.

News March 16, 2024

జగన్‌కు ఈసారి ఆ సెంటిమెంట్ కలిసొచ్చి విజయం వరించేనా..?

image

మరికాసేపట్లో ఇడుపులపాయలో వైసీపీ అభ్యర్థులను జగన్ ప్రకటించనున్నారు. జిల్లాకు చేరుకున్న సీఎం ఇడుపులపాయ బయలుదేరి వెళ్లారు. మహానేత సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం మంత్రి ధర్మాన ప్రసాదరావు, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌లు అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత 2019 ఎన్నికల సమయంలో వీరు ఇద్దరే ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు. మరి అదే సెంటిమెంట్ ఈసారి ఎన్నికలలో కలిసొస్తుందా చూడాలి.

News March 16, 2024

జగన్‌కు ఈసారి ఆ సెంటిమెంట్ కలిసొచ్చి విజయం వరించేనా..?

image

మరికాసేపట్లో ఇడుపులపాయలో వైసీపీ అభ్యర్థులను జగన్ ప్రకటించనున్నారు. జిల్లాకు చేరుకున్న సీఎం ఇడుపులపాయ బయలుదేరి వెళ్లారు. మహానేత సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం మంత్రి ధర్మాన ప్రసాదరావు, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌లు అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత 2019 ఎన్నికల సమయంలో వీరు ఇద్దరే ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు. మరి అదే సెంటిమెంట్ ఈసారి ఎన్నికలలో కలిసొస్తుందా చూడాలి.

News March 16, 2024

మామ, అల్లుడు మధ్య రసవత్తరమైన పోరు

image

పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ పోటీ చేయనున్నారు. ఈయన భాష్యం విద్య సంస్థల్లో భాగస్వామిగా ఉన్నారు. అలాగే భాష్యం డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు స్వయాన ప్రవీణ్‌కి చిన్న మామ. శంకర్ రావు అన్నయ్య కూతురిని ప్రవీణ్ వివాహం చేసుకున్నారు. దీంతో ఈసారి మామ, అల్లుడు మధ్య పోరు రసవత్తరంగా మారింది.