Prakasam

News March 29, 2024

ప్రకాశం: నేటి నుంచి జూనియర్ కళాశాలలకు సెలవులు

image

జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలలకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి వేసవి నెలవులు ప్రకటిస్తున్నట్లు ఆర్ఐవో సైమన్ విక్టర్ తెలిపారు. జూన్ 1న కళాశాలలు పునః ప్రారంభమవుతాయన్నారు. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలన్నింటికి ఈ ప్రకటన వర్తిస్తుందన్నారు. వేసవి సెలవుల్లో కళాశాలల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 29, 2024

వృద్ధ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి: బాపట్ల కలెక్టర్

image

దివ్యాంగులు, వృద్ధ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. ఇదే అంశంపై గురువారం జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని బాపట్ల కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లాలో 14,525 మంది దివ్యాంగ ఓటర్లు, 8,633 మంది వృద్ధ ఓటర్లు ఉన్నారని కలెక్టర్ అన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు.

News March 28, 2024

సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా: SP పరమేశ్వరరెడ్డి

image

సోషల్ మీడియాలో నిరాధార, వాస్తవ దూరమైన సమాచారం ప్రసారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. తప్పుడు సమాచారం, బెదిరింపులకు పాల్పడే పోస్టులపై పూర్తి బాధ్యతను గ్రూప్ అడ్మిన్‌నే వహించాల్సి ఉంటుందన్నారు.

News March 28, 2024

పశ్చిమ ప్రకాశంను వీడని కరువు.. ప్రజల వలస

image

కరువుతో పశ్చిమ ప్రకాశం ప్రజలు వలసబాట పడుతున్నారు. ఉన్న ఊళ్లో బతుకుభారమై పొట్టచేత పట్టుకొని పట్టణాలు, నగరాలకు తరలి వెళ్తున్నారు. అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దీంతో చాలా గ్రామాలు జనం లేక వెలవెలబోతున్నాయి. అడపాదడపా తాగునీరు అందిస్తున్నప్పటికీ చాలీచాలక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొని ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు కరువు నివారణకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు..

News March 28, 2024

చీరాల: TDP అభ్యర్థి ఫ్యాక్టరీలో రూ.56 లక్షలు స్వాధీనం

image

చీరాల మండలం కావూరివారి పాలెంలోని బాపట్ల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మకు చెందిన రాయల్ మెరైన్ ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.56 లక్షల నగదును గురువారం పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. పక్కాగా అందిన సమాచారంతో చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్, రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ తమ సిబ్బందితో మెరుపు దాడి చేసి నగదును సీజ్ చేశారు.

News March 28, 2024

HM.పాడు: కుక్కల దాడిలో 60 గొర్రెలు మృతి

image

హనుమంతునిపాడు మండలంలోని సీతారాంపురంలో గురువారం కుక్కల దాడిలో 60 గొర్రెలు మృతి చెందాయి. సీతారాంపురం గ్రామానికి చెందిన తెల్లయ్య, గురవయ్యకి సంబంధించిన గొర్రె పిల్లలను దొడ్లో కట్టేశాడు. కుక్కల మంద వచ్చి దాడి చేయడంతో 60 గొర్రె పిల్లలు మృతి చెందాయని వారు తెలిపారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

News March 28, 2024

ప్రకాశం: ఘోర రోడ్డు ప్రమాదంలో UPDATE

image

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపల్లె జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. డ్రైవర్ నిద్రమత్తులో కారును డివైడర్ పైకి ఎక్కించడంతో వెహికల్ బోల్తా పడింది. కారులో ఐదుగురు ప్రయాణిస్తూ ఉండగా, ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్, చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు తరలించారు.

News March 28, 2024

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పాలకొల్లు నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2024

దర్శి టికెట్‌పై నీలినీడలు?

image

దర్శి టికెట్‌పై రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతుంది. కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారా అని అటు పార్టీలో, ఇటు ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొనగా, రోజుకో కొత్త పేరు వినపడుతోంది. టీడీపీ నుంచి గోరంట్ల రవికుమార్, మాజీ MLA గొట్టిపాటి నరసయ్య కుమార్తె లక్ష్మి పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే చేస్తోంది. బాచిన కృష్ణచైతన్య, మాగుంట రాఘవరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటు జనసేన నుంచి గరికపాటి వెంకట్ టికెట్ ఆశిస్తున్నాడు.

News March 28, 2024

ఒంగోలు: ‘బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి’

image

వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ఇతర ప్రాధాన్య రంగాలకు కూడా లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. బుధవారం ప్రకాశ్ భవన్‌లో జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో ఎస్.హెచ్.జి మహిళల జీవనోపాధి మరింత మెరుగుపడేలా రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విద్యా రుణాలు మంజూరు వేగవంతం చేయాలన్నారు.