India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాయవరం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఆశాలత ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఫిజిక్స్- 1 పోస్టు, గణితం-2, ఆంగ్లం-1, హిందీ-2, సివిక్స్-1, పీటీఈ- 5 పోస్టులు, జీఎన్ఎం నర్స్- 1 పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈనెల 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు లోపు దరఖాస్తులను చీమకుర్తి గురుకుల పాఠశాలల్లో అందజేయాలన్నారు.
నిరుద్యోగ యువకుల కోసం ఈ నెల 23న ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాది కార్యాలయ అధికారి టి.భరద్వాజ్ తెలిపారు. ఏదైనా విభాగంలో డిప్లొమా, ITI, టెన్త్, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు రావాలన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.14.500 నుంచి రూ.21 వేల వరకు వేతనం ఇస్తారని, అధనంగా ప్రోత్సహకాలు ఉంటాయన్నారు. వివరాలకు 08592 281776ను సంప్రదించాలన్నారు.
వినుకొండలో జరిగిన హత్యను టీడీపీ ప్రభుత్వానికి ఆపాదించడం హేయమైన చర్యని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వివాదాన్ని రెచ్చగొట్టేందుకే జగన్ వినుకొండలో పర్యటిస్తున్నారని, హత్యా రాజకీయాలకు పేటెంట్ హక్కు వైసీపీకే దక్కుతుందని ఆరోపించారు. చంద్రబాబు వద్ద జగన్ ఆటలు సాగవనే విషయం తెలుకోవాలని అన్నారు. పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
పెండింగ్ కేసులపై దృష్టి సారించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఒంగోలు ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కేసు దర్యాప్తులో ప్రత్యేక టీంగా ఏర్పడి త్వరగా చేధించాలన్నారు. మహిళల భద్రతకు స్టేషన్ పనితీరును మరింత మెరుగుపరుస్తామని ఎస్పీ వెల్లడించారు.
ప్రకాశం జిల్లా, పశ్చిమ మెట్ట మండలాలను కలుపుతూ పోయే నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు వేగం పుంజుకున్నాయి. ఈ మార్గం గుంటూరు జిల్లా నడికుడి నుంచి ప్రారంభమై, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా చిత్తూరు, శ్రీకాళహస్తి వరకు 308 కి.మీ నిర్మాణం జరుగుతుంది. 37 రైల్వేస్టేషన్లకు గాను, ప్రకాశం జిల్లాలో కురిచేడు, ముండ్లమూరు, దర్శి, పొదిలి, కొనకనమిట్ల, కనిగిరి, పామూరు స్టేషన్లకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది.
జిల్లాలో వివిధ కార్యక్రమాల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ సేవలు పటిష్ఠంగా అమలు జరగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ రిజిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్స్, ట్రెజరీ, ఆడిట్, ఎండోమెంట్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు.
ఒంగోలుకు చెందిన వైసీపీ నాయకురాలు జిల్లెలమూడి రమాదేవి శుక్రవారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి సమక్షంలో పార్టీలో చేరగా, కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ముఖ్య మహిళా నేతగా ఈమె ఉన్నారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
కనిగిరి మండలం నందన మారెళ్లలో శుక్రవారం స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఉదయం 6 గంటల సమయంలో ప్రకంపనాలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు గ్రామస్థులు వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది.
స్కాలర్షిప్ NMMS ప్రవేశపరీక్ష 2023 డిసెంబర్ 3న జరిగిన పరీక్షలో అందులో ప్రతిభ కనబరిచిన వారి జాబితా ప్రకాశం వెబ్సైట్లో ఉంచినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. ఎంపికైన విద్యార్థులు వెబ్సైట్ నుంచి వారి మెరిట్ కార్డును డౌన్లోడ్ చేసుకుని పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా తల్లి పేరును సరిచూసుకోవాలన్నారు. వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే న్యూడిల్లి వారి స్కాలర్షిప్ పోర్టల్ లో ఆగస్టు 31 లోగా అప్లోడ్ చేయాలన్నారు.
జిల్లాలో వర్షం పడుతున్న నేపథ్యంలో ప్రజలు విద్యుత్ వాడే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్.ఈ కెవిజి. సత్యనారాయణ అన్నారు. గురువారం ఒంగోలులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యుత్ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. వచ్చే 4 రోజుల సిబ్బందికి సెలవులు లేవని స్పష్టం చేశారు. విద్యుత్ అంతరాయం ఉన్నట్లయితే 1912కి లేదా స్థానిక సిబ్బందికి తెలపాలని కోరారు. తడిచేతులతో విద్యుత్ పరికరాలు తాకవద్దని అన్నారు.
Sorry, no posts matched your criteria.