Y.S.R. Cuddapah

News March 21, 2024

కడప టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డికి నోటీసులు

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్.మాధవిరెడ్డికి గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కడప రెవెన్యూ డివిజన్ అధికారి & రిటర్నింగ్ అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. బుధవారం మాధవిరెడ్డి సోషల్ మీడియాలో ఎంసీసీని ఉల్లంఘిస్తూ అభ్యంతరకరమైన పోస్టును విడుదల చేయడంపై షోకాజ్ నోటీసు అందజేసినట్లు పేర్కొన్నారు.

News March 21, 2024

YVU కాన్వకేషన్ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు

image

కడప: యోగి వేమన విశ్వవిద్యాలయం ఏప్రిల్ మాసంలో జరప తలపెట్టిన స్నాతకోత్సవంలో డిగ్రీ, పీజీ, పి.హెచ్.డి పట్టాలు పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు పొడిగిస్తూ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల అభ్యర్థనల మేరకు గడువు పొడిగిస్తున్నట్లు వీసీ వెల్లడించారు. ఇప్పటిదాకా వివిధ డిగ్రీల పట్టాల కోసం 8,898 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

News March 21, 2024

అన్నమయ్య: Love Failureతో యువకుడు సూసైడ్

image

ప్రేమ విఫలమై మహేష్ (19) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లక్కిరెడ్డిపల్లి మండలం, బి.ఎర్రగుడి గ్రామం, కాపుపల్లెలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు హుటాహుటిన లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 21, 2024

లక్కిరెడ్డిపల్లి: బావిలో దూకి ఆత్మహత్య

image

లక్కిరెడ్డిపల్లె మండలంలోని కస్తూరురాజుగారిపల్లి కస్పాకు చెందిన వంటేరు లక్ష్మీదేవి(27) గురువారం తెల్లవారుజామున బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు పోస్టుమార్టం కొరకు లక్ష్మీదేవి మృతదేహాన్ని లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహిత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

News March 21, 2024

పులివెందుల: హత్య కేసులో నిందితుడు అరెస్ట్

image

ఈనెల 18వ తేదీన పులివెందులలోని నగిరిగుట్టలో జరిగిన రెంటాల బాబు హత్య కేసులో ముద్దాయి రెంటాల సురేశ్‌ను అరెస్టు చేసినట్లు పులివెందుల అర్బన్ సీఐ శంకర్ రెడ్డి చెప్పారు. రెంటాల అనురాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి ముద్దాయిని మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. కూర వేయలేదనే కారణంతో బాబుని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదని వివరించారు.

News March 21, 2024

కడప జిల్లాలో 8 మంది డీబార్

image

సార్వత్రిక పరీక్షలు అక్రమాలకు పాల్పడిన జమ్మలమడుగు జిల్లా పరిషత్ బాలిక పాఠశాల కేంద్రంలో 8 మంది విద్యార్థులను డీబార్ చేసినట్లు డీఈఓ అనురాధ తెలిపారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ అధికారులు తొలగించినట్లు చెప్పారు. కొత్తవారిని నియమించినట్లు తెలిపారు. బుధవారం జరిగిన పదో తరగతి ఆంగ్ల పరీక్షకు 2138 మందికి 1947 మంది హాజరయినట్లు తెలిపారు.

News March 21, 2024

ప్రొద్దుటూరు: ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

image

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి <<12893521>>వరదరాజుల రెడ్డి<<>>పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే మంగళవారం 38వ వార్డులో, 22వ వార్డులో వరదరాజుల రెడ్డి అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేశారని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News March 21, 2024

ప్రొద్దుటూరు: వరదరాజుల రెడ్డిపై కేసు నమోదు

image

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డిపై కేసు నమోదు అయింది. ప్రొద్దుటూరు 22వ వార్డు కౌన్సిలర్ వైఎస్ మహమ్మద్ గౌస్ ఇంటిలో బుధవారం వరదరాజుల రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి సమావేశం నిర్వహించారని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి హైమావతి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కౌన్సిలర్ వైఎస్ మహమూద్ గౌస్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డిపై కేసు నమోదు చేశారు.

News March 21, 2024

కడపకు సీఎం జగన్.. బస్సుయాత్ర రూట్ మ్యాప్ ఇదే

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 27న కడప జిల్లాలో జరగనున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర రూట్ మ్యాప్‌లో రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. 27న ఉదయం ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి, అనంతరం వేంపల్లి, వీరపునాయనపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటారన్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతారని పేర్కొన్నారు.

News March 21, 2024

కడప: ప్రశాంత ఎన్నికల కోసం అందరి సహకారం

image

ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అందరి సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లో ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం జేసీ గణేశ్ కుమార్, కడప కమిషనర్ ప్రవీణ్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటింటా ప్రచారం చేయాలన్నా కూడా అనుమతులు తప్పనిసరన్నారు. సభలు సమావేశాల నిర్వహణకు 48 గంటల ముందే పర్మిషన్ తీసుకోవాలని సూచించారు.